Anasuya:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలయ్యి మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో వెంటనే అనసూయ పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండ పై సంచలనమైన ట్వీట్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ ఫలితం రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటూ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.
ఈ విధంగా అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు దారుణంగా అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ… ఛీ… ఛీ బోలెడంత చెత్త వస్తోంది ఎంత క్లీన్ చేసిన ఈ చెత్త ఇలాగే వస్తోంది అంటూ కామెంట్ చేశారు.
ఇలా ఈమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్ చేయడంతో అభిమానుల సైతం రెచ్చిపోయి అనసూయ ను ఏకంగా ఆంటీ అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్ను ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తారా…మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది తప్పకుండా మీపై చర్యలు తీసుకుంటా అంటూ ఈమె కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే ఆంటీ అంటేనే కేసు ఫైల్ చేస్తే ట్విట్టర్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో వెంటనే అనసూయ ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఇక్కడ చాలా జైలు, సెక్షన్లో ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందించారు. ఇలా ఈమె తన గురించి వచ్చినటువంటి ప్రతి ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఘాటుగా స్పందించడమే కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై చేస్తున్న పోరాటం అని, తన గౌరవం కోసం చేస్తున్న పోరాటమిదని రుజువు చేయడం కోసమే ఇలా రీ ట్వీట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. మీరు నన్ను మాత్రమే కాకుండా ఈ విషయంలోకి నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరూ బాధపడతారంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…