Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె వృత్తిపరమైన విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే అనసూయ సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈమె ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఎన్సిసి క్యాంపులో సుశాంక్ పరిచయం ఏర్పడటంతో అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ రహస్యగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు అయితే అనసూయ తండ్రి తనకోసం ఒక పైలెట్ సంబంధం తీసుకువచ్చారట మంచి ఉద్యోగం మంచి ఆస్తిపరుడు తనకు పెళ్లి చేయాలని భావించారు. అయితే అనసూయ మాత్రం తన ప్రేమ విషయాన్ని తన తల్లి ద్వారా తన తండ్రికి చేరవేయడంతో తన తండ్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా తాను తెచ్చిన సంబంధం చేసుకుంటే సరేనని లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటూ తన లగేజ్ మొత్తం బయటకు విసిరేసారట. దీంతో తన లగేజ్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి అనసూయ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు తన తండ్రి అంగీకారం కోసం ఎదురు చూశారట. తన తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో సుశాంక్ తో మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటూ ఈమె మాట్లాడారట కానీ శశాంక్ మాత్రం అలా వెళ్లి పెళ్లి చేసుకుంటే మనకు ఎలాంటి గౌరవం ఉండదు ఆయన మనసు తప్పకుండా మారుతుందని ఎదురు చూశారట.
9 ఏళ్ల నిరీక్షణ..
ఇలా అనసూయ ఎంతకీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి తన తండ్రి ఒక అడుగు వెనక్కి వేసి తన ప్రియుడుతోనే తనకు పెళ్లి చేశారని అయితే ఇష్టంగా మాత్రం చేయలేదని కానీ అనసూయకు పిల్లలు పుట్టిన తర్వాత తనని మనస్పూర్తిగా అంగీకరించారని తెలుస్తుంది. ఇలా తన పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తన ప్రేమ గెలిపించుకోవడం కోసం ఈమె ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను అంటూ గతంలో కూడా తెలిపిన సంగతి తెలిసిందే.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…