Anchor Varshini: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ గా గుర్తింపు పొందిన వారిలో వర్షిని కూడా ఒకరు. ఢీ షోలో టీం లీడర్ గా వ్యవహరించి తన అమాయకత్వంతో అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న వర్షిని ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాకుండా అడపా దడపా సినిమాలలో కూడా నటిస్తోంది. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది. అలాగే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోల వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా వర్షిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో వల్ల కొంతమంది నెటిజెన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. టాటా ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ నెల 18న ముంబై-హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్కి యాంకర్ వర్షిణి కూడా హాజరయ్యింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్తో ఆమె సెల్ఫీ దిగింది.
సూర్య కుమార్ యాదవ్తో ఉన్న ఆ ఫోటోను వర్షిణి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే వర్షిని ఏం చేసినా కూడా ముందు వెనక ఆలోచించకుండా పని కట్టుకొని విమర్శలు చేసే మ్యాచ్ ఇప్పుడు కూడా ఆమె పై విమర్శలు చేస్తున్నారు. క్రికెటర్ తో దిగిన ఫోటో గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిమాన క్రికెటర్ తో ఫోటో దిగటం వల్ల వారిద్దరి మధ్య రిలేషన్ అంటగడుతూ వర్షిణి గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
‘నిన్ను ఎవ్వరు రానిచ్చారు లోపలికి, ఈ రోజు నైట్కి ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటున్నారా అని కొందరు నీచంగా కామెంట్స్ చేస్తుంటే..భాయ్కి పెళ్లి అయిపోయిందీ అయినా వదలవా’ అంటూ మరికొందరు వరస్ట్ కామెంట్లతో రెచ్చిపోతు బూతు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయంలో వర్షిణి కి సపోర్ట్ చేస్తూ సెలబ్రిటీ అయినా కూడా వారికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి. ఇలా వర్షిణి గురించి నీచమైన కామెంట్లు చేసేవారి మీద ఫైర్ అవుతున్నారు.
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…