Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. పేరు తెలియని వారుండరు. మొన్నటి వరకు కట్టు, బొట్టుతో పాటు.. తెలుగు అమ్మాయిలాగా చక్కగా చీర కట్టుకొని.. చూడటానికి ముద్దుగా కనిపించింది. ఏ మాత్రం స్కిన్ షోకి అవకాశం లేకుండా చూసుకుంటూ వచ్చింది.
తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథలనే ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది కానీ.. ఒక్కసారిగా ఆమె తన లైఫ్ స్టైల్ ని మార్చేసింది. తాజాగా ‘రౌడీబాయ్స్’ అనే సినిమాలో నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల అయింది.
దీంతో ఒక్కసారిగా నెటిజన్లతో పాటు.. అనుపమ ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఎందుకంటే.. ట్రైలర్ లోనే లిప్ లాక్ సీన్ లో కనిపించింది. ఈ విషయంలో చాలా మంది అనుపమను ట్రోల్ చేశారు. డబ్బు కోసం ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తావా..? అంటూ ఆమెను టార్గెట్ చేశారు. రెమ్యూనరేషన్ కోసం ఇంత ఘోరంగా చేస్తావా.. అంటూ రెచ్చిపోయారు.
తాజాగా ఈ ట్రోలింగ్స్ పై అనుపమ స్పందించింది. హీరో ఆశిష్ తో కలిసి లిప్ లాక్ సీన్స్ పై వచ్చిన మీమ్స్ ను చూసి అనుపమ నవ్వుకుంది. దీనికి అభిమానులు ఫీల్ అయితే.. ఇక ఎప్పుడూ ఆశిష్ ను టచ్ కూడా చేయను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఓ ఫిలాసఫీ కూడా చెప్పుకొచ్చింది. సినిమాలో లిప్ లాక్ సీన్లో నటించింది తాను కాదు అని.. కేవలం తన పాత్ర మాత్రమే అంటూ చెప్పింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఆ సీన్ చూసి నెటిజన్లు కచ్చితంగా మనసు మార్చుకుంటారు అంటూ చెప్పింది. ఇలా అనుపమ రియాక్ట్ అయిన తీరు చూసి. నెటిజన్లు ఇంకా రెచ్చిపోయారు. ఇంత వెటకారంగా సమాధానం ఇస్తావా..? రౌడీ బాయ్స్ సినిమాలో నటించింది నువ్వు కాదా.. పాత్ర చేసింది మీరే కదా.. అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…