ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సబ్సిడీ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికి బియ్యం కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల నుంచి ఎవరికైతే బియ్యం కార్డులు ఉంటాయో వారికి మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు పాత రేషన్ కార్డులపై పంపిణీ జరగగా కొందరు రేషన్ బియాన్ని తీసుకోవడం లేదు.
మరి కొందరు రేషన్ బియ్యం తీసుకున్నా ఆ బియ్యాన్ని అమ్ముకోవడం లేదా వినియోగించుకోకపోవడం జరుగుతుంది. జగన్ సర్కార్ జనవరి నెల నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు బదులుగా బియ్యం కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విధాలా అర్హులైన వాళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేస్తోంది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించేది. అయితే ఇకపై బియ్యం కార్డులు రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ప్రభుత్వం జనవరి నెల నుంచి ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.
జగన్ సర్కార్ బియ్యం కార్డు అమలు విషయంలో మార్చిన నిబంధనల వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర రేషన్ సరుకులను పొందగలుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52,70,217 బియ్యం కార్డులు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…