Featured

ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డు ఉంటేనే సరుకులు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సబ్సిడీ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికి బియ్యం కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల నుంచి ఎవరికైతే బియ్యం కార్డులు ఉంటాయో వారికి మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు పాత రేషన్ కార్డులపై పంపిణీ జరగగా కొందరు రేషన్ బియాన్ని తీసుకోవడం లేదు.

మరి కొందరు రేషన్ బియ్యం తీసుకున్నా ఆ బియ్యాన్ని అమ్ముకోవడం లేదా వినియోగించుకోకపోవడం జరుగుతుంది. జగన్ సర్కార్ జనవరి నెల నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు బదులుగా బియ్యం కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విధాలా అర్హులైన వాళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేస్తోంది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించేది. అయితే ఇకపై బియ్యం కార్డులు రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ప్రభుత్వం జనవరి నెల నుంచి ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

జగన్ సర్కార్ బియ్యం కార్డు అమలు విషయంలో మార్చిన నిబంధనల వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర రేషన్ సరుకులను పొందగలుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52,70,217 బియ్యం కార్డులు ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బ్రహ్మ ముహూర్తం అలవాటు పెంచుకుంటే మీలో ఈ మార్పులు ఖాయం!

మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…

5 minutes ago

ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!

ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…

10 minutes ago

భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!

భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…

16 minutes ago

చేతిలో ఉన్న ₹50 నోటు… వెనుక ఇంత గొప్ప చరిత్ర ఉందని మీకు తెలుసా?

భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…

21 minutes ago

రసగుల్లాలు తిన్న వెంటనే పక్షవాతం… ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసుకోండి!

హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…

27 minutes ago

దేవాలయానికి వెళ్లే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం ఎందుకు?

హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…

1 hour ago