Featured
ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డు ఉంటేనే సరుకులు..?
Published
4 years agoon
By
lakshanaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సబ్సిడీ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికి బియ్యం కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల నుంచి ఎవరికైతే బియ్యం కార్డులు ఉంటాయో వారికి మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు పాత రేషన్ కార్డులపై పంపిణీ జరగగా కొందరు రేషన్ బియాన్ని తీసుకోవడం లేదు.
మరి కొందరు రేషన్ బియ్యం తీసుకున్నా ఆ బియ్యాన్ని అమ్ముకోవడం లేదా వినియోగించుకోకపోవడం జరుగుతుంది. జగన్ సర్కార్ జనవరి నెల నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు బదులుగా బియ్యం కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని విధాలా అర్హులైన వాళ్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేస్తోంది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించేది. అయితే ఇకపై బియ్యం కార్డులు రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ప్రభుత్వం జనవరి నెల నుంచి ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.
జగన్ సర్కార్ బియ్యం కార్డు అమలు విషయంలో మార్చిన నిబంధనల వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర రేషన్ సరుకులను పొందగలుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52,70,217 బియ్యం కార్డులు ఉన్నాయి.
You may like
Nagababu: రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టె…. రోజాపై నాగబాబు కామెంట్స్ వైరల్!
AP CM Jagan Mohan Reddy: సీఎం జగన్ ఎనర్జీ డ్రింక్ ఇదే.. ఫుల్ ఫుడ్ డైట్ బయట పెట్టేసిన మంత్రి రోజా!
Un Stoppable 2: శృతి నేను హాట్ పెయిర్ ఆఫ్ ఏపీ… అన్ స్టాపబుల్ షోలో బాలయ్య షాకింగ్ కామెంట్స్!
Hero vishal: సీఎం జగన్ అంటే ఇష్టం…కుప్పం రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్!
Ambanti Rambabu: పవన్ నాలుగో పెళ్లికి పోలవరం ప్రాజెక్టు ముడిపెట్టి అడ్డంగా బుక్ అయిన అంబటి రాంబాబు !
Ramanaidu Studio: రామానాయుడు స్టూడియోని బెదిరించి మరీ జగన్ రాయించుకున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి !
Featured
Pawan Kalyan: ఆ రోజు నుంచే డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించబోతున్న పవన్ కళ్యాణ్?
Published
1 hour agoon
17 June 2024By
lakshanaPawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి గెలుపు అందుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పిఠాపురం నుంచి 70 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఈయన కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేయగా 100కు 100% విజయం సాధించారు.
ఇక పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది జనసేన నాయకులకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా ఈయన నియమింపబడ్డారు.
ఇలా మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను త్వరలోనే తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటేరియట్లో ఈయనకు ఛాంబర్ సిద్దమవుతుందని త్వరలోనే ఈయన మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మాత్రమే కాకుండా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు.
ప్రజాసేవకే పరిమితం..
ఇక రాజకీయాలలో ఈయన బిజీగా మారిన నేపథ్యంలో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పవన్ కళ్యాణ్ తెరపై మనం చూడలేమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయన కమిట్ అయిన మూడు సినిమాలు షూటింగ్ పనులు సగం వరకు పూర్తి చేసుకున్నాయి. అయితే ఆయనకు వీలైనప్పుడు మిగతా సినిమాలను పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల పైన ప్రజాసేవకే దృష్టి సారిస్తారని తెలుస్తుంది.
Featured
YS Jagan: రేవంత్ రెడ్డికి తెలియకుండానే జగన్ రెడ్డి ఇంటి ముందు కూల్చివేతలు జరిగాయా?
Published
1 hour agoon
17 June 2024By
lakshanaYS Jagan: తెలంగాణలో ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చోటు చేసుకున్నటువంటి కూల్చివేతల సంచలనంగా మారాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలాకాలం నుంచి నివాసం ఉండట్లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే లోటస్ పాండ్ వద్ద ఉన్నటువంటి తన ఇంట్లో తన చెల్లెలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మ ఉంటున్నారు. ఈమె తెలంగాణ ఆంధ్ర రాజకీయాలలో చురుగ్గా ఉన్నా కూడా ఇక్కడి నుంచే కార్యాచరణ నిర్వహించేవారు. అయితే తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం వేయించుకున్న మూడు షెడ్లను కూల్చి వేశారు.
ఈ విధంగా జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు నిర్వహించడంతో రహదారి చాలా అసౌకర్యంగా మారిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్ ఈ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం పై అధికారులకు కూడా తెలియకుండా జరిగాయని తాజాగా మరొక వైరల్ గా మారింది.
సీఎంకు తెలియదా…
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నటువంటి విషయం తెలియదని, అయితే ఈ కూల్చివేతలు జరిగిన 24 గంటల లోపే సదరు అధికారిపై సస్పెన్స్ వేటు వేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.జగన్ ఇంటి వద్ద ఆక్రమణలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌఖిక ఆదేశాలను జారీ చేయడం వల్లే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూల్చివేతలు నిర్వహించారు. అయితే ఈ కార్యాచరణలో భాగంగా అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటుపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారండి.
Featured
Ap: ఏపీ రుషికొండ భవనాలపై విమర్శలు.. సంచలన పోస్ట్ చేసిన వైసీపీ!
Published
1 hour agoon
17 June 2024By
lakshanaAp: జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈయన ఋషికొండను తవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా కొండలను తవ్వి సంపదను మొత్తం దోచుకుంటున్నారంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ కు మరింత అందాన్ని రెట్టింపు చేస్తూ అక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మించారు.
ఇక తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు కానీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఈ బంగ్లాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల చేతులలోకి వెళ్లిపోయాయి.
ఇప్పటివరకు ఋషికొండ ప్రాంతంలో కట్టిన ఆ బంగ్లా ఎలా ఉంది అనే విషయాలు బయటకు రాలేదు కానీ మొదటిసారి తెలుగుదేశం పార్టీ నేతలు బంగ్లాలలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఎవరికోసం ఈ బాత్రూములు కట్టించావు అంటూ వైసీపీ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఎవరికో స్కెచ్ వేసే ఇలా ఖరీదైన బాత్రూం కట్టించారు అంటూ విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై వైసీపీ స్పందించింది.
అవి ప్రభుత్వ భవనాలే..
రిషి కొండల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భవనాలే అవేవీ ప్రైవేట్ భవనాలు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని నిర్మించారు.. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు.. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆదిత్యం ఇవ్వడానికి సరైన భవనం లేకపోవడం వల్లే వీటిని నిర్మించారని కానీ ఇప్పుడు టిడిపి పార్టీ ఈ ఫోటోలను విమర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలిపారు.. టిడిపి వక్ర బుద్ధి అంటే ప్రజలకు తెలుసు అంటూ తెలియజేశారు.
Pawan Kalyan: ఆ రోజు నుంచే డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించబోతున్న పవన్ కళ్యాణ్?
YS Jagan: రేవంత్ రెడ్డికి తెలియకుండానే జగన్ రెడ్డి ఇంటి ముందు కూల్చివేతలు జరిగాయా?
Ap: ఏపీ రుషికొండ భవనాలపై విమర్శలు.. సంచలన పోస్ట్ చేసిన వైసీపీ!
Renu Desai: బుద్ధి ఉంటే ఇలా మాట్లాడవు… పవన్ అభిమానికి ఇచ్చి పడేసిన రేణు దేశాయ్?
Ram Charan: కూతురి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చరణ్.. నిరాశలో అభిమానులు!
బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
Trisha: ఒక్క రోజైనా అలా బ్రతకాలని ఉంది.. వింత కోరికను బయట పెట్టిన త్రిష?
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
Trending
- Featured4 weeks ago
బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు
- Featured1 week ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured3 weeks ago
Trisha: ఒక్క రోజైనా అలా బ్రతకాలని ఉంది.. వింత కోరికను బయట పెట్టిన త్రిష?
- Featured3 weeks ago
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
- Featured3 weeks ago
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
- Featured3 weeks ago
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
- Featured3 weeks ago
Chiranjeevi: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న చిరంజీవి.. సంతోషంలో మెగా ఫాన్స్?
- Featured3 weeks ago
Rashmika Mandanna: నువ్వు నా ఫ్యామిలీ రా.. ఆనంద్ దేవరకొండ ను ఆట పట్టించిన రష్మిక?