Connect with us

Movie News

నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ వస్తున్నా ధీమహి చిత్రం

Published

on

ధీమహి చిత్రం ట్రైలర్ విడుదల. అక్టోబర్ 27న విడుదల

కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసారు చిత్ర యూనిట్.

Advertisement

అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ “మా ధీమహి చిత్రం ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల అవుతుంది. అయితే ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసాం. ట్రైలర్ చాలా బాగుంది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ రెండు నిమిషాల ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచుతుంది. హీరో సాహస్ పగడాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకు 7:11PM చిత్రం తో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ను మరియు ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. విసుల్స్ మరియు సినిమాటోగ్రఫీ బాగున్నాయి, నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ చిత్రంలో పొందుపరిచారు. చిత్రాన్ని మొత్తం ఫారిన్ లోనే షూట్ చేసారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి థ్రిల్లింగ్ అంశాలతో సరికొత్త కథ కథనం తో ఉంటుంది. మా చిత్రం అందరికి నచ్చుతుంది.

7:11 చిత్రం లో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రం లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు. మా చిత్రం లోని పాటలు జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం, తప్పక చుడండి” అని తెలిపారు.

చిత్రం పేరు : ధీమహి

నటీనటులు : సాహస్ పగడాల, నిఖిత చోప్రా, విరాట్ కపూర్, జె డి చెరుకూరు, ఆషిక, శ్రీజిత్, గంగాధరన్, సౌజన్య కాసినా, వంశి దావులూరి, తదితరులు

Advertisement

ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి

కెమెరా మాన్ : రహ్ శర్మ

మ్యూజిక్ : షారోన్ రావి

Advertisement

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : వంశి (సినీ డిజిటల్)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చైతు పడిగల

Advertisement

కో ప్రొడ్యూసర్ : ఎమ్ ఎస్ కార్తీక్, శ్రీధర్ రెడ్డి గూడా

దర్శకులు : సాహస్ పగడాల, నవీన్ కంటె

నిర్మాతలు : విరాట్ కపూర్ , సాహస్ పగడాల

Advertisement

Continue Reading
Advertisement

Featured

Shyamala: తాను పవన్ ఫ్యాన్ అంటూ బిగ్ షాక్ ఇచ్చిన శ్యామల.. వెనకడుగు వేసిందా?

Published

on

Shyamala: వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీల బుల్లితెర నటులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల సైతం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈమె వైసీపీకి ప్రచారం చేస్తూ కూటమిపై అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇలా శ్యామల విమర్శలు చేయడంతో ఈమెపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా తాను పవన్ కళ్యాణ్ కు అభిమానిగా మారిపోయాను అంటూ ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే నేను ఆయనకు పెద్ద అభిమానిని కాదు కానీ ఆయన చేసే పనులు ఆయన చేసే సేవ కార్యక్రమాలు చూసి వీరాభిమానిగా మారిపోయానని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలలోకి రావడం సంతోషంగా ఉంది అంటూ ఈమె గతంలో పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

డబ్బులకు అమ్ముడుపోయారు…

ఇలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు చూసే అభిమానిగా మారానని చెప్పినటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయారు అంటూ విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

Advertisement
Continue Reading

Featured

Rashmi: నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి.. రష్మి పై నేటిజన్ కామెంట్.. దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్!

Published

on

Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ కి వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ సందర్భంగా రష్మీ తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ సమాజంలో మూగ జీవాలపై జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కడైనా జంతువులకు హాని చేస్తే ఈమె తప్పనిసరిగా వాటిపై స్పందిస్తూ హాని చేసిన వారికి శిక్ష పడాలి అంటూ తన గళం వినిపిస్తూ ఉంటారు.

తాజాగా ఈమె ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇది షేర్ చేసినటువంటి ఈమె ఇది దారుణం మనం ఇలాంటి వాటిని ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ కామెంట్ లపై నెటిజన్ స్పందించారు.

Advertisement

మనిషికి, పశువుకి తేడా లేదు..
ఈ సందర్భంగా ఒక నైటిజన్ రిప్లై ఇస్తూ ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి… అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈరోజు ఎద్దును చంపిన వాడు రేపు నీ పిల్లలను కూడా చంపుతారు. మనిషికి పశువుకు తేడా తెలియని బ్రెయిన్ వాడిది అంటూ ఈమె రిప్లై ఇస్తూ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Tasty Teja: కొత్త వ్యాపారం ప్రారంభించిన బిగ్ బాస్ టేస్టీ తేజ.. ప్రారంభించిన శివాజీ!

Published

on

Tasty Teja టేస్టీ తేజ పరిచయం అవసరం లేని పేరు ఫుడ్ వ్లాగర్ గా ఎన్నో రకాల ఫుడ్ వీడియోస్ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం వచ్చింది ఇలా యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ అభిమానులను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారని చెప్పాలి అయితే ఈయన తొమ్మిదవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈయన మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఇలా ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నటువంటి తేజ మొదటిసారి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.

ఇరానీ నవాబ్‌ టీ పేరుతో ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం దీన్ని ఓపెన్‌ చేశారు. బిగ్ బాస్ శివాజీ చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుభశ్రీ ప్రియాంక జెన్ అమర్ బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఉప్పల్‌ డీఎస్‌ఎల్ మాల్‌ సమీపంలో ఈ వ్యాపారం ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Advertisement

టీ బిజినెస్..
ఇక ఈ రెస్టారెంట్ ప్రారంభించిన సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఉందని కార్పొరేట్ స్టైల్ లో డిజైనింగ్ చేశారని తెలిపారు. అంతేకాకుండా మొదటిసారి బిజినెస్ లోకి అడుగుపెట్టినటువంటి తేజ మంచి సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!