పదో తరగతి పాసైన వాళ్లకు శుభవార్త.. రూ.20వేల వేతనంతో ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ కోసం జగన్ సర్కార్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది. తాజాగా ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ నుంచి తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10 వేల నుంచి 20 వేల రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ లో డెలివరీ బాయ్స్ గా పని చేయాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ అనుభవం లేనివాళ్లు, ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న పురుష అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. స్థానికులకు ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తారు.

బైక్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలకు సంబంధించి మార్పులు ఉంటాయి. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.