Ashwini dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత అశ్విని దత్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.తాజాగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సీతారామం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి ఈయన ఎన్నో విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని భావించారట. అయితే చివరికి ఎన్టీఆర్ పాత్రను ఈ సినిమాలో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలని అనుకున్నాము. అయితే అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించారు.
ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించడంతో మహానటి సినిమాలో ఆయన పాత్రలో ఎవరిని పెట్టి నటింపచేసిన ప్రజలు, అభిమానులు తప్పుగా భావిస్తారన్న ఉద్దేశంతోనే చివరి నిమిషంలో ఎన్టీఆర్ ను వద్దనుకున్నామని వెల్లడించారు.అయితే ఈ విషయం నాగ్ అశ్విన్ కి తెలియడంతో ఎన్టీఆర్ లేకుండా ఆయన పాత్ర చేస్తా అంటూ తెరవెనక ఎన్టీఆర్ వాయిస్ తో రాజేంద్రప్రసాద్ చేత రెండు డైలాగులు చెప్పించామని ఈ సందర్భంగా అశ్విని మహానటిలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…