Ashwini dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత అశ్విని దత్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.తాజాగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సీతారామం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి ఈయన ఎన్నో విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని భావించారట. అయితే చివరికి ఎన్టీఆర్ పాత్రను ఈ సినిమాలో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలని అనుకున్నాము. అయితే అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించారు.
ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించడంతో మహానటి సినిమాలో ఆయన పాత్రలో ఎవరిని పెట్టి నటింపచేసిన ప్రజలు, అభిమానులు తప్పుగా భావిస్తారన్న ఉద్దేశంతోనే చివరి నిమిషంలో ఎన్టీఆర్ ను వద్దనుకున్నామని వెల్లడించారు.అయితే ఈ విషయం నాగ్ అశ్విన్ కి తెలియడంతో ఎన్టీఆర్ లేకుండా ఆయన పాత్ర చేస్తా అంటూ తెరవెనక ఎన్టీఆర్ వాయిస్ తో రాజేంద్రప్రసాద్ చేత రెండు డైలాగులు చెప్పించామని ఈ సందర్భంగా అశ్విని మహానటిలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…