Adusumilli Srinivasarao : గత కొన్నిరోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త అందరినీ ఊరిస్తోంది. అదే కొమరం భీముడో పాత్రకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అవ్వబోతున్నాడు అని. హాలీవుడ్ పత్రిక వెరైటీ ప్రచురించిన లిస్ట్ లో ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితా లో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు ఉంది. అయితే నిజానికి ఆస్కార్ నామినేషన్స్ లో ఇంకా ఎన్టీఆర్ పేరు ఉందొ లేదో కానీ ఆ లిస్ట్ లో ఉండే అవకాశం ఉందనగానే ఇక్కడ వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తుందా రాదా అంటూ విశ్లేషణ మొదలు పెట్టారు.
ఎన్టీఆర్ కి అవార్డు రాదు… వాళ్ళు రానివ్వరు…
ఇక అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ సినిమాలో ఇద్దరి నటన చాలా బాగా ఉంది పోటీ పడి ఇద్దరూ నటించారు. అయితే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. పాతతరం నటులు కళ్ళతో హావాభావాలు పలికించేవారు అందుకే క్లోజ్ షాట్స్ సినిమాల్లో ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పటి నటులు అలా నటించలేరని క్లోజ్ అప్ షాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. లాంగ్ షాట్స్ తో దర్శకులు పని కానిస్తున్నారు. అయితే ఇప్పటి తరంలో కళ్ళతో హావభావాలు పలికించగల నటుడు ఎన్టీఆర్. కొమరం భీముడు పాటలో కళ్ళతోనే కోపం, బాధ, వంటి అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి ఇచ్చాడు ఒకే పాటలో అది చాలా తక్కువ మందికి సాధ్యం.
అయితే ఆస్కార్ కి ఇంకా అయన నామినేషన్ లో లేడు. కేవలం నామినేషన్ అయ్యే అవకాశం ఉన్న వారి జాబితాలో ఉన్నాడు అంతే. కానీ ఒకవేళ నిజంగా నామినేట్ అయినా అవార్డు రాకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర నాటకీయత హావభావలు అంటూ చూస్తాము కానీ హాలీవుడ్ లో మొహంలో భావాలు లేకుండా ఉండేదే నటన అన్నట్లు భావిస్తారు. వాళ్ళ సినిమాల్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు గమనిస్తే అందుకే మన వాళ్లకు ఇస్తారనే నమ్మకం లేదు. కానీ అక్కడిదాకా వెళ్లడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పచ్చు అంటూ శ్రీనివాసరావు రావు గారు అభిప్రాయపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…