Sitaramam Movie: తెలుగు సినిమాలకు ఆగస్టు నెల బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల మొదట్లో విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2సినిమాలు విడుదలయి ఇప్పటికి భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి.ఇకపోతే హను రాఘవపూడి దర్శకత్వంలో క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా వచ్చిన సినిమా సీతారామం.
ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటించాల్సిన అవకాశం సరాసరి దుల్కర్ సల్మాన్ కు దక్కలేదు.కొందరు టాలీవుడ్ హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఇలాంటి సూపర్ హిట్ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చింది.
మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ సినిమా కథను ముందుగా డైరెక్టర్ హను రాఘవపూడి రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించారట. ఈయన కిఈ సినిమా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని ఒకానొక సమయంలో డైరెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక విజయ్ దేవరకొండ కాదనడంతో ఈ సినిమా కథతో డైరెక్టర్ హీరో రామ్,నానికి కూడా వినిపించారట.
ఈ విధంగా నాని రామ్ కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం దుల్కర్ సల్మాన్ కు వెళ్ళింది. ఇలా ఈ సినిమాతో మలయాళ నటుడు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో మన టాలీవుడ్ హీరోలు మాత్రం డిజాస్టర్ సినిమాలు చేయడం కోసం ఈ సూపర్ హిట్ సినిమాని చేతులారా వదులుకున్నారని చెప్పాలి. నాని నటించిన అంటే సుందరానికి సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు ఇక రామ్ నటించిన దివారియర్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఈ హీరోలు సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…