అస్సాం ప్రభుత్వం స్కూల్ లో చదివే విద్యార్థినులకు ఇంటర్ పాసైన విద్యార్థినులకు, పై తరగతులు చదివే విద్యార్థినులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంచలన నిర్ణయం తీసుకుంది. అస్సాం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రతిరోజూ స్కూల్ కు వెళ్లే విద్యార్థినులకు రోజుకు 100 రూపాయల చొప్పున ఇస్తామని కీలక ప్రకటన చేశారు.
రోజుకు 100 రూపాయల చొప్పున ఇవ్వడం ద్వారా పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు చదువుకోవడానికి ఖర్చులకు ఆర్థిక సహాయం అందుతుందని అస్సాం సర్కార్ భావిస్తోంది. అదే సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసైన విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా స్కూటీని అందజేయనుంది. ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా త్వరలో అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్, ఆ పై తరగతులు చదివే విద్యార్థినులను ప్రభుత్వం ఖర్చుల నిమిత్తం 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పుస్తకాలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఖాతాల్లో నగదు జమ చేయనుంది. బీజేపీ సర్కార్ గతేడాది ఈ స్కీమ్ లను అమలు చేయాలని భావించింది.
ఆయితే కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల స్కీమ్ ల అమలు సాధ్యం కాలేదు. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం, తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో అస్సాం సర్కార్ ప్రస్తుతం ఈ స్కీమ్ ను అమలు చేస్తూ విద్యార్థినులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…