Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి ‘సై ‘ సినిమా వల్ల తను ఎంతో ఇబ్బంది పడ్డాను అంటూ రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆ సినిమా మానసికంగా ఇబ్బంది పెట్టింది…
సై సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఆవుల గిరి ఆ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా నష్టాలను ఇవ్వలేదని అలాగని మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టాలేదంటూ తెలిపారు. రాజమౌళి మొదట తనకు నార్మల్ కమర్షియల్ సినిమా కావాలా లేక స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక సినిమా అనుకుంటున్నా అలాంటిది చేద్దామా అని అడిగితే నేను రొటీన్ బోర్ కొట్టి స్పోర్ట్స్ సినిమాకు ఓకే చెప్పాను. అయితే కొంత మంది హీరోలు నన్ను కలిసి సినిమా అవకాశం అడిగినా సుధాకర్ రెడ్డి గారికి మాటిచ్చానని నితిన్ ను హీరోగా పెట్టుకుందామనుకున్నా రాజమౌళి ఓకే చేసాడు.
అయితే ఆ మధ్యలో చాలా మంది హీరోలు నన్ను కలిసి మాట్లాడేసరికి సుధాకర్ రెడ్డి గారు నితిన్ తన కుటుంబంతో ఇంటికి వచ్చి మీరు డెసిషన్ మార్చుకోకండి సినిమాలో నేను చేస్తాను అని అడిగారు. సినిమా పూర్తయింది. సినిమా ఫలితం బాగుంది కానీ లాభాలు ఎక్కువ రాకపోయినా నాకు బాధగా అనిపించలేదు కానీ నితిన్ ని హీరోగా పెట్టుకోవడం వల్ల జరిగిన పరిణామాలకు మానసికంగా చాలా బాధపడ్డాను సై సినిమా విషయంలో అంటూ తెలిపారు. ఆ సినిమా తరువాత విజయేంద్ర ప్రసాద్ అలాగే రాజమౌళి మరో సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు కానీ నేనే వినియోగించుకోలేదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…