Bellamkonda Sai Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి శ్రీనివాస్ అనంతరం నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.
ఇకపోతే తాజాగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి చత్రపతి సినిమాని రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి ప్రొడ్యూసర్ కావడం వల్ల తను సినిమా ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చానని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తాను పడే కష్టం తనకు మాత్రమే తెలుసని తెలిపారు.అయితే తాను హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే తమ కుటుంబం పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని శ్రీనివాస్ తెలిపారు.
ఈ సినిమాకు నాన్న నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా కంటే ముందుగా నాన్న ఎనిమిది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆ కారణంగా తనపై అధిక ఒత్తిడి పడింది.దీంతో వచ్చిన సినిమా అవకాశాలను కూడా రిజెక్ట్ చేసి దాదాపు ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉన్నానని ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…