Bellamkonda Sai Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి శ్రీనివాస్ అనంతరం నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.
ఇకపోతే తాజాగా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి చత్రపతి సినిమాని రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి ప్రొడ్యూసర్ కావడం వల్ల తను సినిమా ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చానని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తాను పడే కష్టం తనకు మాత్రమే తెలుసని తెలిపారు.అయితే తాను హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చే ముందే తమ కుటుంబం పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని శ్రీనివాస్ తెలిపారు.
ఈ సినిమాకు నాన్న నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా కంటే ముందుగా నాన్న ఎనిమిది సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆ కారణంగా తనపై అధిక ఒత్తిడి పడింది.దీంతో వచ్చిన సినిమా అవకాశాలను కూడా రిజెక్ట్ చేసి దాదాపు ఏడాదిన్నర పాటు ఇంట్లోనే ఉన్నానని ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…