BHEL Prasad : చక్రవాకం సీరియల్ లో విల్సన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ ఆ తరువాత పలు సీరియల్ లో నటించినా ఆ సీరియల్ లో వచ్చిన గుర్తింపు ఇంకే సీరియల్ కు రాలేదు. ఇప్పటికే ఆయన పేరు ప్రసాద్ అనే కంటే విల్సన్ అని చెబితే బాగా గుర్తుపడతారు. ఒకసారి తిరుమలకి వెళ్లిన సమయంలో అక్కడ పురోహితులు చక్రవాకం సీరియల్ లో విల్సన్ గా గుర్తుపట్టి మాట్లాడించడం బాగా అనిపించిందని చెప్పిన ప్రసాద్ గారు సినిమాల్లో అవకాశాలకోసం పడిన అవమానాలను, కష్టాలను గురించి చెప్పారు.
పూరీ ఇంటికి వెళ్తే గేట్ బయట నిలబెట్టి అవమానించారు…
ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, శ్రీకారం వంటి సినిమాల్లో నటించిన ప్రసాద్ గారు సినిమా అవకాశాలు కోసం ఆయన ప్రయత్నాల్లో ఉన్నపుడు ఎదుర్కొన్న అవమానాలను చెప్పారు. అవకాశం కోసం ఒకసారి పూరీ జగన్నాథ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది నన్ను గేట్ బయటే ఆపేసారు. లోపలికి వెళ్లనివ్వలేదు. అతను నన్ను గుర్తుపట్టలేదని అర్థమైంది. కానీ ఆ నిమిషం చాలా బాధగా అనిపించింది. నాకు ఆర్థికంగా ఏ లోటు లేదు కదా ఇలా ఇంకొకరి ఇంటి ముందు ఇలా పడిగాపులు ఎందుకు అనిపించింది. కానీ అలా అనుకుంటే మంచి అవకాశాలు రావు కదా అనిపించి అక్కడే ఎదురు చూసాను.
అక్కడ డ్రైవర్ ఒకరు నన్ను గుర్తు పట్టగా లోపలికి వెళ్ళినపుడు బి హెచ్ఇ ఎల్ ప్రసాద్ వచ్చార్స్ని చెప్పు లోపలికి రమ్మంటే ఓకే లేదంటే లేదు అని చెబితే, ఆ డ్రైవర్ లోపలికి వెళ్ళాక కాసేపయ్యాక పూరీ గారు కారులో లోపలి నుండి బయటికి వచ్చి నన్ను గుర్తుపట్టి మాట్లాడారు. లోపలికి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు వెళ్లి కలవండి అని చెప్పారు. ఇక సినిమాలో నటిస్తున్నపుడు, నేను సీరియల్ లో నటించే సమయంలో నా కన్నా చిన్న ఆర్టిస్ట్ ఆ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాడు. అతనికి సెపెరేట్ కారవన్ కూడా ఇచ్చారు. మాకు నలుగురికి కలిసి ఒక రూమ్ ఇచ్చారు. సక్సెస్ అనేది ఎవరి ఫేట్ ని అయినా డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. నాకు చక్రవాకం సమయంలో ఫేమ ఉంది ఇపుడు అతనికి ఉంది అంతే మళ్ళీ నాకొక రోజు వస్తుంది. ఆ రోజు మళ్ళీ మంచి అవకాశాలతో డిమాండ్ ఉన్న ఆర్టిస్టును అవుతాను అంటూ చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…