తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు వారాల్లో ఎప్పుడు జరగని విధంగా ఈ సారి నామినేషన్లు జరగుతున్నాయి.
బిగ్ బాస్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నా.. లోబో సీక్రెట్ రూంలో ఉన్నాడు కాబట్టి ఇక 12 మంది మాత్రమే ఆట ఆడుతున్నారు. కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతున్నా కొలది ఆటలో కూడా మజా పెరిగిపోతోంది.ముగ్గురు వేటగాళ్ల చేతిలో నామినేషన్ ప్రక్రియను ఉంచినట్లు తెలుస్తోంది.
దీనిలో ప్రియాంక ఎంతో అగ్రెసివ్ గా కనిపిస్తుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చిందులు వేస్తుంది. అయితే నామినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం 9 మంది ఉన్నట్లు లీకురాజాల ద్వారా తెలిసింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్, ప్రియ, యానీ, రవి, పింకీ, కాజల్, జెస్సీ, సిరి నామినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.
మొదటి నుంచి కూడా బిగ్ బాస్ నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా ఇది నిజమైతదో .. లేదో తెలియాలంటే ఈ రోజు వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక 13 మందిలో ఆ 9 మంది నామినేట్ కాగా మిగిలిన వారు నామినేషన్లో లేరని తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…