Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం 13వ వారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వారంలో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అందరూ కూడా ఈ ఫినాలే రౌండ్ నుంచి తప్పుకోవడంతో చివరికి అర్జున్ డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ కు చేరారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ టాస్కుల నుంచి తప్పుకోవడంతో చివరికి అమర్ అర్జున్ మిగిలారు. ఇక అమర్ కూడా శోభ చెప్పిన విధంగా ఆట ఆడుతూ కన్ఫ్యూజన్ అయ్యారు. దీంతో అర్జున్ ఫినాలేకి చేరుకున్నారు.
ఇలా అర్జున్ ఫైనల్ కు వెళ్లడంతో తిరిగి మరోసారి అమర్ కు నిరాశ ఎదురయింది. అయితే శోభ తన అతి తెలివితేటలను ప్రదర్శిస్తూ అమర్ కు గొడవ పెట్టాలని ప్రయత్నం చేశారు. గౌతమ్ ఈ టాస్క్ నుంచి తప్పుకోవడంతో తన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ సగం తన స్నేహితుడైనటువంటి అర్జున్ కి ఇవ్వాలని అనుకుంటాడు కానీ ప్రియాంక చెప్పడంతో ఆ పాయింట్స్ కాస్త అమర్ కి ఇస్తుంది. అయితే గౌతమ్ తన పాయింట్స్ ఇస్తూ ఇవి ప్రియాంక పాయింట్స్ అయితే ఇకపై తనని ఏమీ అనుకు అంటూ ఇచ్చారు దీంతో అమర్ కూడా సైలెంట్ అయ్యారు.
ఇలా గౌతమ్ పాయింట్స్ అమర్ కి ఇవ్వడంతో మధ్యలో ఇన్వాల్వ్ అయినటువంటి శోభా ఏమనకు అంటే ఏంటీ.. పాయింట్స్ ఇస్తే ఇవ్వు.. అలా అనడం కరెక్ట్ కాదు గౌతమ్ అంటూ గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ గౌతమ్ ఆమె మాటలను పట్టించుకోలేదు. తిరిగి మరోసారి అర్ధరాత్రి ఇదే రచ్చ చేసింది శోభా శెట్టి. పల్లవి ప్రశాంత్ వద్ద ఏవిక్షన్ పాస్ ఉంది. మళ్లీ పవర్ అస్త్రను కూడా తనే గెలిస్తే ఎలాగ అందుకే నీకు సపోర్ట్ చేయమని వెళ్లి అర్జునుని అడుగు అంటూ పంపించింది. అమర్ శోభ చెప్పిన విధంగానే తనని వెళ్లి అడిగారు.
మొదటి ఫైనలిస్ట్ గా అర్జున్…
అమర్ తనకు సపోర్ట్ చేయమని అర్జునుని అడగడంతో అర్జున్ వెంటనే వాడు కూడా మనిషి కదరా తనకు సపోర్ట్ చేస్తే ఏంటి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.దీంతో వాడికి ఎవిక్షన్ పాస్ ఉంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత మూడు టాస్కులలో అర్జున్ గెలిచి మొదటి ఫైనల్ లిస్ట్ కాగా శోభ అతి తెలివితేటలకు అమర్ బలి అయ్యారని తెలుస్తుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…