Bigg Boss 7: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తెలుగులో ఈ కార్యక్రమం 6 సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారం అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది మునుపటిలా కాకుండా ఈ సీజన్ మరింత ఎంటర్టైనింగ్ గా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమంలోకి యాంకర్ రష్మీ వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమం గురించి మరో వార్త వైరల్ గా మారింది. గత కొన్ని సీజన్లో నుంచి బిగ్ బాస్ కార్యక్రమంలోకి సెలబ్రిటీ కపుల్స్ నుపంపిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈసారి మాత్రం అందుకు కాస్త భిన్నంగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈసారి సెలబ్రెటీ కపుల్స్ కాకుండా మాజీ సెలబ్రిటీ కపుల్స్ ను పంపించాలనే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు సమాచారం. సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ నటి ఎస్తర్ నుప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈ జంటను ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి పంపించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
ఇక నోయల్ విడాకులు ఆయన వెంటనే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే సీజన్ సెవెన్ లో మరోసారి ఈ మాజీ దంపతులను పంపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఇందుకు నోయల్ ఎస్తర్ ఒప్పుకుంటారా అనే సందేహాలు కూడా వెలబడుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…