Adi Reddy: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఆలయంలో జనవరి 22వ తేదీ స్వామి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా విరాళాలు అందజేశారు అదే విధంగా భక్తులు కూడా వారికి తోచిన విధంగా కానుకలను రాములోరికి పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా స్వామివారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తూ తమ వంతు సహాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రివ్యూయర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి కూడా రామ మందిరానికి తన వంతు సహాయం చేశారు. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అయోధ్య రామ మందిరానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళం అందించానని ఆదిరెడ్డి తెలిపారు. రామ మందిరం ఏర్పాటు చేయడం అనేది మన హిందువులందరి కళ ఇది మన కల అందుకే ఉడత భక్తితో తాను కూడా కొంత డబ్బు విరాళంగా ఇచ్చానని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విరాళం ఇవ్వాలని ఆదిరెడ్డి ఈ సందర్భంగా అందరినీ కోరారు .
రామ మందిరం మన కల..
ఇక జనవరి 22వ తేదీ జరగబోయే రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…