Adi Reddy: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఆలయంలో జనవరి 22వ తేదీ స్వామి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా విరాళాలు అందజేశారు అదే విధంగా భక్తులు కూడా వారికి తోచిన విధంగా కానుకలను రాములోరికి పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా స్వామివారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తూ తమ వంతు సహాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రివ్యూయర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి కూడా రామ మందిరానికి తన వంతు సహాయం చేశారు. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అయోధ్య రామ మందిరానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళం అందించానని ఆదిరెడ్డి తెలిపారు. రామ మందిరం ఏర్పాటు చేయడం అనేది మన హిందువులందరి కళ ఇది మన కల అందుకే ఉడత భక్తితో తాను కూడా కొంత డబ్బు విరాళంగా ఇచ్చానని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విరాళం ఇవ్వాలని ఆదిరెడ్డి ఈ సందర్భంగా అందరినీ కోరారు .
రామ మందిరం మన కల..
ఇక జనవరి 22వ తేదీ జరగబోయే రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…