Amardeep: అలా కనక జరిగి ఉంటే కచ్చితంగా చంపేసేవాడిని.. కారు ఘటనపై అమర్ షాకింగ్ కామెంట్స్!

Amardeep: బుల్లితెర నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమర్ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి రన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈయన హౌస్ లో పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడంతో బయట కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అంతేకాకుండా గ్రాండ్ ఫినాలే రోజు ఆయన కారుపై పెద్ద ఎత్తున దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ కారు ఘటన తర్వాత పెద్ద ఎత్తున వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇలా పలుమార్లు ఈ ఘటనపై స్పందించిన అమర్ తాజాగా శోభా శెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ శోభా కార్యక్రమంలో అమర్ తన భార్య తేజస్వినితో పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరోసారి కారు ఘటన గురించి అమర్ స్పందించారు.

ఆరోజు కారు పై రాళ్లదాడి జరిగినప్పుడు కారులో నేను అమ్మ తేజు ముగ్గురం ఉన్నామని అయితే అలా రాళ్లు విసరడంతో నేను కారు దిగిపోతానని వాళ్లకు కావాల్సింది నేనే కదా అందరూ నన్ను కొడితే నేను ఏ ఒక్కరినైనా కొడతానని దిగడానికి సిద్ధమైతే అమ్మ తేజు ఆపారని తెలిపారు.

ఒకడినైనా చంపేవాడిని…

పొరపాటున ఆ రాళ్లు కనుక అమ్మకు తగిలి ఉంటే కచ్చితంగా నేను ఎవడినో ఒకడిని చంపేసేవాడిని ఆ సమయంలో నాకు ఓ సినిమా సీక్వెన్స్ మాత్రమే కనిపించిందని అదృష్టవశాత్తు ఎవరికి ఏ విధమైనటువంటి గాయాలు కాలేదని అమర్ తెలిపారు. ఇలా మీ కుటుంబం పై ఎవరైనా రాళ్ల దాడి జరిగితే మీరు ఒప్పుకుంటారా అంటూ ఈ సందర్భంగా అమర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.