Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం మరొక మూడు రోజులలో పూర్తికానుంది. ఈ ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు అయితే వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి బయటకు రాగా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు ఫినాలేకి చేరుకుంటారు.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈ ఆరుగురు కంటెస్టెంట్లలో పల్లవి ప్రశాంత్ అమర్ శివాజీ ఈ ముగ్గురు కూడా టైటిల్ రేస్ లో ఉన్నారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా యావర్ ప్రియాంక ఇద్దరు కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా కొనసాగడమే కాకుండా ఫిజికల్ టాస్కులలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆట తీరును కనపరుస్తున్నారు.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక హౌస్ లో ఉన్నటువంటి ఈ ఆరుగురిలో అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చారు. అంతే కాకుండా ఈయన ఒకరి దగ్గర మరొకరి మాటలను మాట్లాడుతూ నెటిజెన్స్ నుంచి కాస్త నెగిటివిటీనీ మూటగట్టుకున్నారు.
ఓటింగ్ లో వెనుకబడ్డ యావర్
ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వారం యావర్ ఓటింగ్ శాతం తగ్గిందని తెలుస్తుంది. దీంతో మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి యావర్ ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు రాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే యావర్ బయటకు వస్తే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారని చెప్పాలి. మరి ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు రాబోతున్నారు ఎవరు కప్ అందుకోబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…