సాధారణంగా క్షణికావేశంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులలోకి వెళ్లి పోతాము. ఇలా క్షణికావేశంలో ఓ యువకుడు తన నాన్నమ్మ ప్రాణాలను బలి తీసుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్పూర్లోని రక్ష గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దిలీప్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇన్ని రోజులు పని నిమిత్తం బయటకు వెళ్లిన దిలీప్ దసరా పండుగ రోజు ఇంటికి వచ్చాడు.
అయితే తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో పలు మనస్పర్ధలు గొడవలు వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో ఈ గొడవలు అన్నింటికీ కారణం తన నాన్నమ్మ అని గ్రహించిన దిలీప్ తన పై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన నానమ్మ ఉదయం ఇంటిముందు ముగ్గు వేస్తున్న సమయంలో దిలీప్ ఆవేశంతో తన లారీని తన నానమ్మ పై ఎక్కించాడు.
ఇలా ఈ ప్రమాదంలో తన నానమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలోనే తన తల్లి మరణించడంతో
దిలీప్ తండ్రి రాజేశ్వర్ రాయ్ తన కొడుకు దిలీప్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా తన ప్రమాదానికి ఉపయోగించిన లారీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…