Sanjay dutt and drugs :సంజయ్ దత్ బాలీవుడ్ హీరో గా కంటే తన జీవితంలో జరిగిన నాటకీయా సంఘటనల వల్ల బాగా పాపులర్ అయ్యారు. డ్రగ్స్ తీసుకోవడం, బాంబు పేలుళ్ల కేసులో జైలుకి వెళ్లడం, ఇక క్యాన్సర్ తో పోరాడడం..ఇలా తన జీవితం లో చాలా జరిగాయి.ఇక డ్రగ్స్ కి ఎలా అలవాటు పడ్డారు, అసలు ఎందుకు డ్రగ్స్ తీసుకున్నారు లాంటి విషయాలను ఆయన ఇటీవలి ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. కేజీఎఫ్ లో అదీరాగా ఆయన నటన అందరిని ఆకట్టుకుంది.
అమ్మాయిల కోసం డ్రగ్స్….
అమ్మాయిలతో మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడినని,కానీ వాళ్ళతో మాట్లాడటం కోసం డ్రగ్స్ ను ఆశ్రయించానని డ్రగ్స్ తీసుకుంటే వారికి కూల్ గా కనిపిస్తానని అనుకునే వాడినని చెప్పుకొచ్చారు. ఇక అమ్మాయిలకి నచ్చేలా ఉండడానికి ప్రయత్నించే వాడినని చెప్పారు. ఇక డ్రగ్స్ ను వదలడానికి రిహబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి తిరిగి తన జీవితాన్ని కొత్తగా మార్చుకున్నాడు సంజయ్. కానీ రిహబిలిటేషన్ సెంటర్ నుండి వచ్చాక అందరు తనను డ్రగ్గీ అనిపిలవడం మొదలుపెట్టారని ఇక ఆ మచ్చను పోగొట్టుకోవడానికి తాను బాడీ బిల్డింగ్ వైపుమరలానని చెప్పారు.అందరు ఆ తరువాత డ్రగ్గీ అన్నవాళ్లే మెచ్చుకోవడం ప్రారంభించారాని చెప్పారు.
ఇక 1993 ముంబై బాంబు కేసు విషయంలో సంజయ్ ఇంట్లో మారణాయుధాలు, పేలుడు పదార్థాలు దొరకడంతో ఆయన జైలుకి వెళ్లారు.ఇక ఆ తరువాత క్యాన్సర్ భారిన పడి చికిత్స కోసం అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. ఇక కేజీఎఫ్ సినిమాలో అధీరగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఇక ఈయన జీవితాన్ని బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రణ్ భీర్ కపూర్ సంజయ్ గా లీడ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా సంజు గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…