Category Archives: Movie News

Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?

Nag Aswin: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జునకు ఒక హీరోయిన్ అలాగే ఒక హీరో హిట్ సెంటిమెంట్ గా మారారని అందుకే తన సినిమాలలో వీరిద్దరిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ వీరిద్దరూ ఉండేలా ఈయన జాగ్రత్త పడుతున్నారట. నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి కల్కి ఈ మూడు సినిమాలలో వీరిద్దరూ నటించారు నటించిన ఇదివరకు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అందుకే ఈ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ ఉండేలా అశ్విన్ జాగ్రత్త పడ్డారు.

విజయ్ దేవరకొండ.. మాళవిక నాయర్..
ఈ హిట్ సెంటిమెంట్ ప్రకారం ఈయన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్రీ బుకింగ్స్ భారీగా జరగడంతో సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Tollywood: గన్నవరం చేరుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. పవన్ తో కీలక భేటీ?

Tollywood: టాలీవుడ్ కి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరంతా నేడు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు.

ఈ విధంగా టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను వివరించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే స్పెషల్ షోస్ బెనిఫిట్ షోలకు కూడా పరిమితి లేదు. ఈ క్రమంలోనే ఈ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గత ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లేకుండా చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు చిత్ర పరిశ్రమపై ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే భేటీ కానున్నారని తెలుస్తోంది.

ఇండస్ట్రీ సమస్యలపై చర్చ..
ఇక ఈ భేటీలో భాగంగా ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీ దత్, అల్లు అరవింద్, నాగ వంశీ, యార్లగడ్డ సుప్రియ, టిజి విశ్వప్రసాద్, దగ్గుబాటి సురేష్ వంటి వారందరూ కూడా వెళ్లారని తెలుస్తోంది. మరొక మూడు రోజులలో అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ భేటీ అనంతరం కల్కి సినిమా టికెట్ల విషయంలో కూడా క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది.

Nagarjuna: కొంచమైనా మానవత్వం ఉందా.. ట్రోల్స్ కి గురైన నాగార్జున.. క్షమాపణలు చెప్పిన హీరో!

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున తన సినిమాల వరకు తాను బిజీగా ఉంటారు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా కల్పించుకోరు. అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన అత్యవసరమైతే తప్ప ఆయా సంఘటనలపై స్పందించరు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగార్జున భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ట్రోల్స్ కి గురి కావడంతో వెంటనే నాగార్జున క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు నాగార్జున క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనని తోసేసారు దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపై జరగవు.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జున పై ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అలా ఒక వ్యక్తిని తోయటం సరైంది కాదు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ నాగార్జున ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Kalki: ఏపీలో పెరిగిన కల్కి సినిమా టికెట్ల రేట్లు.. ఎంతంటే?

Kalki: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు టికెట్ల రేట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు.

అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కాలేదు అయితే నిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఈ భేటీలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే కల్కి సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అదనపు షోలకు అనుమతి..
ఇక కల్కి సినిమా విడుదలైన తర్వాత సింగిల్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయలను రెండు వారాలు పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా రోజుకు ఐదు షోలు వేసుకొనే అనుమతి కూడా తెలియజేయడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన తన ఫస్ట్ సినిమా హీరోయిన్.. ఫోటో వైరల్!

Pawan Kalyan: సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ప్రస్తుత రాజకీయ నాయకుడిగా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా మారారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా పలు శాఖల బాధ్యతలను తీసుకొని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అనంతరం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు.

ఇలా పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో పాటు లేడీ ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ కూడా పవన్ కళ్యాణ్ ను కలిసారు. ఇలా వీరంతా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అనంతరం చిత్ర పరిశ్రమపై ఉన్నటువంటి ఇబ్బందుల గురించి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో సమస్యల గురించి ఆయనకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి
ఇక ప్రస్తుత ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం వారి సమస్యలను తెలియజేశారు.ఈ క్రమంలోనే సుప్రియ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సుప్రియ పెద్దగా సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మారగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా మారడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.

Amitabh Bachchan: నన్ను ట్రోల్ చేయొద్దు.. ప్రభాస్ అభిమానులకు బిగ్ బీ క్షమాపణలు!

Amitabh Bachchan: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చిత్ర బృందం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముందుగా నాగీ ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది చెప్పటానికి కొన్ని ఫొటోస్ చూపించారు.

ఇక ఇందులో నేను ప్రభాస్ ను కొట్టే పాత్రలో నటించారు. అయితే దీనిని ప్రభాస్ అభిమానులు ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకుని నన్ను ట్రోల్ చేయొద్దు. ప్రభాస్ ను కొట్టినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈయన క్షమాపణలు చెప్పారు.

ప్రభాస్ ను కొట్టాను..
ఈ విధంగా అమితాబ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్ రియాక్ట్ అయ్యారు. అయ్యో సార్ నా అభిమానులంతా కూడా మీకు అభిమానులే అంటూ ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tollywood: పవన్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్!

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు పవన్ కళ్యాణ్ .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ విజయం పై ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈయన తన నిర్మాణ సంస్థలో ఏకంగా వంద సినిమాలను నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.

టీజీ విశ్వప్రసాద్..
ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా ఈయన నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది తద్వారా పవన్ కళ్యాణ్ తో చాలా మంచి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఈయన సెలెబ్రేట్ చేశారు జూన్ 23వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Anasuya: జాకెట్ విప్పడంతో ట్రోల్స్ ఎదుర్కొంటున్న అనసూయ.. వింత రోగం అంటూ కౌంటర్!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఈమె ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. తద్వారా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బుల్లితెరకు ఇన్ని రోజులు దూరం ఉన్నప్పటికీ త్వరలోనే మరో సరికొత్త గేమ్ షో ద్వారా బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో అనసూయ శేఖర్ మాస్టర్ తో పోటీపడుతూ జాకెట్ విప్పేసి రచ్చ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ విషయంపై కామెంట్ చేస్తూ..ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుందని పోస్ట్ పెట్టాడు. అనసూయ స్పందించింది. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇంత రోగంతో భాదపడుతున్నారని అనిపిస్తోంది అంటూ కౌంటర్ ఇచ్చింది.

కొన్ని మార్పులు తప్పవు..
మీరంటే నాకు చాలా ఇష్టం మీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయి. మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ బ్యాడ్ వైపు వెళ్ళకూడదనీ మరొక నెటిజన్ కామెంట్ చేయగా అనసూయ స్పందిస్తూ.. మేము సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళం మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు తప్పవు. మీరంతా బుల్లితెరపై మాత్రమే తప్పులను కనిపెడతారు కానీ సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు వస్తే హిట్ చేస్తారు అంటూ తనదైన శైలిలోనే ఈమె సమాధానం ఇచ్చారు.

Avinash:10 లక్షలు ఇచ్చాకే వదిలిపెట్టారు.. మల్లెమాల పై ముక్కు అవినాష్ షాకింగ్ కామెంట్స్!

Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరంలేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటూ స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించే స్టార్ మా పరివార్ నీతోనే డాన్స్ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్న అవినాష్ దావత్ కార్యక్రమానికి వచ్చారు.

ఈ కార్యక్రమానికి రీతు చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కు అవినాష్ మాట్లాడుతూ మల్లెమాల వారిపై ఆరోపణలు చేశారు.. జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న అవినాశ్ జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటని రీతు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అవినాష్ సమాధానం చెబుతూ నేను జీవితంలో ఇంకా ఎదుగుదలను కోరుకున్నాను అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి నేను బయటకు రావాలి అనుకున్న సమయంలో మల్లెమాలవారు పది లక్షల రూపాయల ఫైన్ కడితేనే బయటకు పంపిస్తామని తెలిపారు.

కరోనా సమయంలో నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారు కానీ నాకు బిగ్ బాస్ అవకాశం రావడం సంతోషం అనిపించింది బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలి మల్లెమాల వారితో ఉన్న కమిట్మెంట్ పూర్తి కాలేదు దాంతో ఫైన్ కట్టమన్నారు. ఆ సమయంలో శ్రీముఖి నా ఫ్రెండ్స్ 10 లక్షలు సహాయం చేశారని తిరిగి వారి డబ్బు వాళ్లకి ఇచ్చానని తెలిపారు.

బిగ్ బాస్ పునర్జన్మ ఇచ్చింది..

ఇక జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఎవరైనా జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటారు కానీ వెనక్కి తిరిగి వెళ్లాలనుకోరు నాకు బిగ్ బాస్ కార్యక్రమం పునర్జన్మ ఇచ్చిందని ఈ కార్యక్రమాల ద్వారా నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి అంటూ అవినాష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.