తెలుగు బుల్లితెర ప్రపంచంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ టెలివిజన్ నటి వాసవి (పద్మ) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె బుధవారం తన స్వస్థలం విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో టెలివిజన్ పరిశ్రమతో పాటు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వాసవి మరణవార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భావోద్వేగాలతో నిండిన పోస్ట్లో, వాసవిని కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశామని, కానీ విధి వేరేలా నిర్ణయించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఆమెను బతికించేందుకు చివరి వరకూ పోరాడాం. కానీ ఇక కష్టం అని డాక్టర్లు చెప్పడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె కన్నుమూసింది” అంటూ కరాటే కళ్యాణి రాసుకొచ్చారు. వాసవి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇటీవలే వాసవి క్యాన్సర్తో పోరాడుతున్న విషయాన్ని కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఆమె వైద్య ఖర్చులకు సహాయం చేయాలని కోరగా, పలువురు సీరియల్ నటీనటులు, అభిమానులు స్పందించారు. వాసవి పరిస్థితిపై ఇండస్ట్రీలో చర్చ కూడా జరిగింది. అయినా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చివరకు ఆమె ప్రాణాలు నిలువలేకపోయాయి.
వాసవి చాలా కాలంగా టెలివిజన్ రంగంలో క్రియాశీలకంగా ఉన్నారు. 1978లో విజయనగరంలో జన్మించిన ఆమె, టీవీ మరియు సినీరంగాల్లో ‘జయవాహిని వాసవి’ పేరుతో మంచి గుర్తింపు సంపాదించారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. విలనస్ పాత్రల్లోనూ సహజమైన అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
చివరిసారిగా ఆమె ‘బహిర్భూమి’ అనే చిత్రంలో నటించారు. నటనతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే వాసవి, రీల్స్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్లో ఉండేవారు. అందుకే ఆమె మృతి వార్త అభిమానులను మరింత కలచివేసింది.
వాసవి మరణంపై పలువురు సినీ, టీవీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రతిభావంతమైన నటి, మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లేని లోటు బుల్లితెర ప్రపంచంలో చాలా కాలం కనిపిస్తుందని అభిమానులు భావోద్వేగంగా చెబుతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…