2020 సంవత్సరంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే కేంద్రం అనేక నిర్ణయాలను తీసుకున్నా ఆ నిర్ణయాలు అంత సానుకూల ఫలితాలను ఇవ్వలేదు.
దీంతో కేంద్రం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీమ్, లీవ్ ట్రావెల్ కన్సీషన్ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను కల్పించాలని కేంద్రం భావిస్తోంది. కన్సూమర్ స్పెండింగ్ను పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్స్ ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.
ఈ రెండు స్కీమ్ ల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు డబ్బులు పొందవచ్చు. లీవ్ ట్రావెల్ కన్సీషన్ స్కీమ్ ద్వారా లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు నగదు పొందే అవకాశం ఉంటుంది. టికెట్ ధరకు మూడు రెట్లు డబ్బులను, లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద ఉద్యోగులు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు నాలుగేళ్లలో ఒకసారి ఎల్టీసీ పొందడానికి కేంద్రం ఛాన్స్ కల్పిస్తోంది.
స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు పది వాయిదాల్లో పది వేల రూపాయలను చెల్లించే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కేంద్రం ఈ ఆఫర్లను ప్రకటించింది. కేంద్రం 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు 50 సంవత్సరాల కాలపరిమితితో అందించనుందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…