Charmme Kaur: కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎగిరి పడితే తిరిగి కాలమే మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. అందుకే ఎలాంటి సమయంలోనైనా అనిగిమనిగి ఉండడం మంచిదని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు నటి చార్మి. లైగర్ సినిమా విడుదల అనంతరం ఛార్మికి సంబంధించిన ఒక పాత ట్వీట్ ద్వారా ఈమె అడ్డంగా దొరికిపోవడంతో మెగా అభిమానులు చార్మిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
గతంలో మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా గురించి నటి చార్మి, ట్విట్టర్ ద్వారా కామెంట్ చేస్తూ క్లాప్స్ కొట్టడమే కాకుండా నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. ఇలా ఈమె ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా ఒకప్పుడు రామ్ చరణ్ సినిమాలు చూసిన నవ్విన ఛార్మి ప్రస్తుతం తన లైగర్ సినిమాతో నవ్వుల పాలయ్యింది.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లైజర్ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సమస్థ 200 కోట్లు ఆఫర్ చేసిన రిజెక్ట్ చేసినట్లు స్వయంగా చార్మి చెప్పడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున ట్రోల్ చేయడమే కాకుండా అప్పట్లో రామ్ చరణ్ సినిమా గురించి చేసిన ట్వీట్ గురించి ప్రస్తుతం మెగా అభిమానులు చర్చిస్తూ చార్మిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఒకప్పుడు తమ హీరో సినిమా ఫ్లాప్ అయితే నవ్విన ఈమె ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో నవ్వుల పాలు అయిందంటూ భారీగా చార్మిని ట్రోల్ చేస్తున్నారు.అసలే సినిమా ఫ్లాప్ కావడంతో బాధలో ఉన్నటువంటి వీరిపై సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ మాత్రం పుండు పై కారం చల్లిన విధంగా గతంలో వీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ భారీగా చిత్ర బృందంపై ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఇలాంటి టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్ అభిమానుల సైతం ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…