Featured

Chiranjeevi: బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు చేశారు.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చిరంజీవి తాజాగా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేశారు.గాడ్ ఫాదర్ సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టిన రోజే నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బండారు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందిందని ఇలా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలియచేశారు.

ఇక ఇండస్ట్రీలో హీరోలు వారి అభిమానుల గురించి కూడా మాట్లాడారు సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల మధ్య విభేదాలు ఉంటాయి. కానీ హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని తెలియజేశారు.తన సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా ఇండస్ట్రీలో అందరిని పిలిచి భోజనాలు పెట్టే వాడినని చిరంజీవి పేర్కొన్నారు. ఇక పాలిటిక్స్ లోకి వెళ్లిన తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయని తెలియజేశారు.

Chiranjeevi: ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా…

ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ అమ్ముకుంటున్నానని ఆరోపణలు కూడా చేశారు. అయితే నేనెప్పుడూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

11 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

11 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

12 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

13 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

13 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

14 hours ago