Shraddha Das: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కమెడియన్ హైపర్ ఆది. కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన హైపర్ ఆది అనంతరం ఢీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.
ఈ విధంగా వారానికి మూడు నాలుగు రోజులపాటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న హైపర్ ఆది వేసే పంచ్ డైలాగులు కొన్నిసార్లు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది నోటిదూల కారణంగా ఏకంగా చెంప దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఎదురైంది.
హైపర్ ఆది వేదిక పైకి వచ్చిన నటి శ్రద్ధదాస్ ను తనకు ముద్దు కావాలని అడిగారు.ఈ మాట విన్నటువంటి శ్రద్ధాదాస్ హిందీలో మాట్లాడుతూ అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా అని ప్రశ్నించగా తనకు ఒకటి కాదు రెండు ముద్దులు కావాలని అడిగారు. ఇదే సమయంలోనే యాంకర్ ప్రదీప్ కాస్త మసాలా జోడించారు.ఇక హైపర్ ఆది తనకు ముద్దు కావాలని కళ్ళు మూసుకొని శ్రద్ధాదాస్ వైపు బుగ్గ పెట్టగా ఒక్కసారిగా ఈమె తన రెండు చేతులతో హైపర్ ఆది చెంప చెల్లుమనిపించింది.
ఈ విధంగా శ్రద్ధాదాస్ దెబ్బకి ఖంగు తిన్నటువంటి హైపర్ ఆది ముందు అంటే తప్ప అని చెప్పింది ఎవడ్రా అంటూ యాంకర్ ప్రదీప్ ఉద్దేశించి మాట్లాడారు.ముద్దు అంటే గూసా అని అనీ మాస్టర్ చెప్పగా అరగంట గూసా అని ఆది శ్రద్ధాదాస్ తో అన్నారు. ఆ తర్వాత శ్రద్ధాదాస్ ఆది చాతిపై వరుసగా పంచ్ లు ఇవ్వడం అందరికి నవ్వు తెప్పించింది. మొత్తానికి హైపర్ ఆది శ్రద్ధాదాస్ నుంచి ముద్దు కావాలని ఆశపడగా ఆమె మాత్రం తన స్టైల్ లో ఆది చెంప చెల్లుమనిపించింది.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…
హైదరాబాద్లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…