Chiranjeevi – Madhavi : 1978 ప్రాణం ఖరీదు సినిమాతో ఈ జంట కలిసి వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. అలా ప్రారంభమైన వీరి ఇద్దరి సినీ ప్రయాణం. అనేక విజయవంతమైన చిత్రాలలో ప్రేక్షకులను ఆనందపరిచారు. అలా 1983లో మూడు నెలల వ్యవధిలో వచ్చిన మూడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.
1983, జూలై లో పిఎన్ఆర్ పిక్చర్స్, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో ‘రోషగాడు’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు.
కథలోకి వస్తే..
చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం.
1983 అక్టోబర్ 20న విజయసాయి పిక్చర్స్,కోడి రామకృష్ణ దర్శకత్వంలో “సింహపురి సింహం” చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, రాధిక హీరో,హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా నటించిన చిరంజీవికి (రాజశేఖరం) భార్యగా రాధిక, సోదరునిగా గొల్లపూడి నటించారు. అలాగే కొడుకుగా నటించిన చిరంజీవి(విజయ్) ప్రియురాలిగా మాధవి నటించారు. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో నాల్గవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.
ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం. చిత్ర సమర్పకుడు ఎం. తిరుపతి రెడ్డి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావించారు. అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ (1982) ఆధారంగా ఒక కథను డెవలప్ చేయమని తిరుపతి రెడ్డి పరుచూరి సోదరులను కోరారు. అలా వారు తయారు చేసిన కథతో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలైంది.
ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించిన వీరి మూడు సినిమాల్లో.. “ఖైదీ” సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా.. “రోషగాడు” విజయవంతమై “సింహపురి సింహం” పరాజయం పొందింది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…