Chiranjeevi: మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్వాగతం… మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరంజీవి..ట్వీట్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మూడవ తరం వారసులు అడుగుపెట్టారు. మెగా కోడలు ఉపాసన నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అమ్మాయి జన్మించడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ ఇప్పటికే అపోలో హాస్పిటల్ కి చేరుకొని తమ వారసురాలని చూస్తూ సంబరపడిపోతున్నారు. అయితే తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన మనవరాలకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ పేదికగా స్పందిస్తూ.. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాకతో కోట్లాదిమంది మెగా అభిమానులతో పాటు మాకు సంతోషాన్ని పంచావు. రామ్ చరణ్ ఉపాసనలను తల్లిదండ్రులను చేసావ్ మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ ను చేశావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కోట్లాదిమంది మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Chiranjeevi జ్ఞాపకంలా మిగిలిపోతుంది…


ఈ విధంగా రాంచరణ్ తన మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేవిధంగా ఇతర సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ ఉపాసన దంపతులను పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానించడమే కాకుండా ఈ సమయంలో మీరు గడిపే ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోయే ఓ జ్ఞాపకంలో మిగులుతుంది ముగ్గురు చాలా సంతోషంగా ఉండాలి అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.