Featured

Choreographer Prem Rakshith : నేను డాన్స్ మాస్టర్ అని చెబితే రాజమౌళి గారు తీసేస్తారని…: కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్

Choreographer Prem Rakshith : ప్రపంచవ్యాప్తంగా త్రిపుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ముఖ్యంగా నాటు నాటు పాట ఒక ఊపు ఉపేసింది. అలాంటి పాటలో హేరోలిద్దరూ ఒకేలాగా వేసే నాటు నాటు స్టెప్ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వేసి ఆ పాట మీద ఆ స్టెప్స్ మీద ఉన్న అభిమానం చాటుకున్నారు. ఇక ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్. ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ స్వస్థలం పుదుచెర్రీ. ఆయన మొదట్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలను పడి చివరకు ప్రపంచం మొత్తం తన స్టెప్స్ ను మెచ్చుకునే స్టేజికి ఎదిగారు.

రాజమౌళి గారికి నిజం చెబితే తీసేస్తారని…

మొదట్లో సినిమాలకు డాన్స్ కంపోజ్ చేస్తూనే రాజమౌళి గారి ఇంట్లో పిల్లలకు డాన్స్ నేర్పించేవారు ప్రేమ్ రక్షిత్. తాను సినిమాలకు డాన్స్ కంపోజ్ చేస్తాననే విషయం చెబితే పనిలో నుండి రాజమౌళి తీసేస్తారనే భయంతో ప్రేమ్ రక్షిత్ ఆ విషయం దాచిపెట్టారట. ఒకసారి ‘విద్యార్థి’ సినిమా షూటింగ్ లో డాన్స్ కంపోజ్ చేస్తుండగా పై నుండి ప్రేమ్ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేసిన పాట వినిపించడంతో వెళ్లి చూస్తే రాజమౌళి గారు ఉన్నారట, ఆ సాంగ్ బాబా మాస్టర్ ఎవరో చేసారని అనుకున్నారట.

వెంటనే ప్రేమ్ రక్షిత్ తానే డాన్స్ కంపోజర్ అని చెప్పడంతో ఎందుకు నాకు చెప్పలేదని అడిగారట. చెబుతే పని పోతుదితుంది నా కుటుంబాన్ని పోషించుకోడానికి డబ్బు ముఖ్యం అందుకే చెప్పలేదు అని చెప్పగానే జక్కన ఒక సీడి ఇచ్చి స్టెప్స్ కంపోజ్ చేయమన్నారట. అలా వారిద్దరి ప్రయాణం మొదలై నేడు ఆస్కార్ వేదిక వరకు ఎదిగింది.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

20 minutes ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

24 minutes ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

29 minutes ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

33 minutes ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

38 minutes ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

51 minutes ago