Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి అలాగే తన సినిమా జీవితం గురించి మాట్లాడారు.
పెళ్లి జీవితం మీద దెబ్బ కొట్టింది…
ఒకరిద్దరు తప్పు చేసారని మొత్తం ఆడవాళ్ళు అలాగే ఉంటారని నేను అనను, నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది అంటూ పృథ్వీ రాజ్ మాట్లాడారు. తన జీవితంలో పెళ్లి చాలా దెబ్బతీసిందని ఇక ఆ గతపు జ్ఞాపకాలను మర్చిపోయానంటూ సాఫ్ట్ వేర్ డిలీట్ చేశా అంటూ చెప్పారు. ఇక సినిమా వాళ్లను వారి సంపాదనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు, నన్ను కూడా రోజుకు మూడు దాక సంపాదిస్తున్నావంట కదా అంటారు. అవగాహనా లేకుండా మాట్లాడేస్తుంటారు.
ఒక ఆర్టిస్ట్ బతుకు ఓపెన్ గా మాట్లాడితే ప్రాస్టిట్యూట్ వంటిదే. ఉన్నా లేకపోయినా అందంగా తయారై డబ్బు లేకపయినా అది కనిపించకుండా తయారై కనిపించాలి. అంత రెమ్యూనరేషన్ రాకపోయినా అంత వస్తున్నట్లు బిల్డప్ ఇవ్వాలి. నిజానికి ఒక ప్రాస్టిట్యూట్ అందంగా రెడీ అయితేనే బుక్ చేసుకుంటారు. అలానే ఆర్టిస్ట్ కూడా పైపై మెరుపులు కారు అన్నీ కనిపిస్తేనే తీసుకుంటారు అంటూ చెప్పారు. అందుకోసమే ఒక స్టేటస్ లాంటిది మెయిన్టైన్ చేయాల్సిన వస్తుంది అంటూ చెప్పారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…