హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు, మంత్రులకు మధ్య సమన్వయం లోపించడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా ఆబ్కారీ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీనామా వరకు దారితీసింది.
ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)కు దరఖాస్తు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రిజ్వీకి ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ ఉండగానే ఈ అకస్మాత్తు నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
రిజ్వీ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఆయన రాజీనామా వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొదటగా ప్రభుత్వం రిజ్వీ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా రిజ్వీ వీఆర్ఎస్ను తిరస్కరించాలంటూ సీఎస్ (చీఫ్ సెక్రటరీ)కు రాసిన లేఖ వెలుగులోకి రావడంతో ఈ వివాదంపై అనుమానాలు మరింత పెరిగాయి.
మంత్రి జూపల్లి కృష్ణారావు తన లేఖలో రిజ్వీపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. రిజ్వీ కేవలం అసంతృప్తితోనే కాకుండా, అక్రమాలకు పాల్పడ్డారని, అనుచితంగా ప్రవర్తించారని ఆ లేఖలో పేర్కొన్నారు.
మంత్రి లేఖలోని ముఖ్య ఆరోపణలు:
మరోవైపు, రిజ్వీ తరచూ బదిలీల కారణంగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఆయన నాలుగు శాఖలకు బదిలీ అయ్యారు.
ఈ తరచూ బదిలీలు, అలాగే మంత్రితో సఖ్యత లేకపోవడం వల్లే ఆయన వీఆర్ఎస్ తీసుకునే కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, మంత్రి చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…