Hero Nitin : కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. చైనాలో మొదలైన వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి రెండేళ్లుగా కలవరపెడుతోంది. ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వేరియంట్స్ రూపంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం క్రితం కేవలం రోజువారీ కేసుల సంఖ్య పదివేల లోపు ఉండేది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య లక్ష దాటింది. దీంతో ఇండియాలో థర్డ్ వేవ్ వస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా సోకింది. మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు సినీరంగ ప్రముఖులు కూడా కరోనా కనిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, సంగీత దర్శకుడు థమన్ కరోనా బారిన పడ్డారు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య షాలినికి కూడా కరోనా సోకింది. ఇలా వరసగా తమ అభిమాన తారలు, సన్నిహితులు కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నితిన్ తన భార్య పుట్టిన రోజు వేడుకలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. కరోనా సోకడంతో నితిన్ షాలిని పుట్టినరోజు వేడుకలను నేరుగా చేయలేకపోయాడు. కరోనాకు హద్దులు ఉంటాయి.. కానీ ప్రేమకు హద్దులు ఉండవన్న రీతిలో పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేశాడు. తన భార్య ఐసోలేషన్ రూమ్ లో ఉంటే కింద కేక్ కట్ చేస్తూ విషెస్ చెప్పాడు. మొట్టమొదటిసారి నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్లు నితిన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదంతా చూడటానికి చాలా ఎమోషనల్ గా ఉంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…