Poverty In Telangana and AP: కోరలు చాస్తున్న పేదరికం..ఏపీ, తెలంగాణలో పరిస్థితి ఏంటంటే..!
Poverty In Telangana and AP: నీతి ఆయోగ్ జాతీయ బహువిధ దారిద్య్ర సూచికలో ఏపీ కన్నా తెలంగాణ వెనకబడి ఉంది. ఆర్థిక, సాంఘిక అసమానతలే తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యాయి. తెలంగాణ వచ్చి ఏడేళ్లు గడిచాయి. అయితే చాలా విషయాల్లో తెలంగాణ ఏపీ కన్నా మెరుగ్గానే ఉంది.
ముఖ్యంగా ఆదాయంపరంగా తెలంగాణ, ఏపీ కన్నా ముందే ఉంది. హైదరాబాద్ తెలంగాణకు మెయిన్ ఆదాయ ఇంజిన్ గా పనిచేస్తోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఏపీకి దూరంగా ఉంది. అయితే ఈ ఏడేళ్ల టైంలో విభజిత ఏపీ కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం ఉన్నదని నివేదికలు పేర్కొంటున్నాయి.
తాజాగా నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ బహువిధ దారి దారిద్య్ర సూచిలో ఈ విషయం తేటతెల్లం అవుతోంది. నీతి ఆయోగ్ జాబితాలో పేదరికంలో మొత్తం 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా… ఏపీ 20 వస్థానంలో నిలిచింది. తెలంగాణలో పూర్వపు 10 జిల్లాలను లెక్కలోకి తీసుకుంటే.. ఆదిలాబాద్ జిల్లా పేదరికంలో మొదటిస్థానంలో ఉంది. నీతి ఆయోగ్ ఈ నివేదికను 2015-16లో తయారైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వివరాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది.
ఈ నివేదిక ఆరోగ్యం, ఫుడ్, విద్యా, లివింగ్ స్టాండర్స్.. ఈ నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. ఇందులో మెరుగైన స్థితిలో ఉన్న రాష్ట్రాలు మంచి స్థానాన్ని సాధించాయి. దేశంలో పేదరికంలో బీహార్ మొదటిస్థానంలో ఉంది. కేరళ పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మెరుగైన స్థానాన్ని సాధించింది. 51.91 శాతంతో బీహార్ రాష్ట్రం అత్యంత నిరుపేద రాష్ట్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసిందది. కేరళ 0.71 శాతం పేదరికం ఉన్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. మొత్తంగా నీతి ఆయోగ్ నివేదిక దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, లివింగ్ స్టాండర్డ్స్, పేదరికాన్ని చూపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…