Sri Reddy: ఏపీ సీఎంను అనే ముందు నన్ను దాటి వెళ్లాలి…ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..!
Sri Reddy: సినిమా టికెట్ రేట్ల విషయం టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య కాక రేపుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే.. సినీ హీరో నాని, సిద్దార్థ్ వంటి వారు ఈవిషయంపై స్పందించారు.
హీరో నాని ఏకంగా.. సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటున్నాయని.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా అంతే రీతిలో స్పందించాడు. ఇదిలా ఉంటే తాజాగా వివాదాస్పద, సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వం, టికెట్ రేట్లపై ట్విట్లతో అగ్నికి ఆజ్యం పోశాడు.
వరసగా ట్విట్లు చేస్తూ కాక రేపాడు. దీనికి సమాధానంగా మంత్రి పేర్ని నాని కూడా ట్విట్లు చేశారు. ఆర్జీవీ ట్విట్ ను రీట్విట్ చేశాడు నాగబాబు. ఇదిలా ఉంటే ఆర్జీవీ మనం కలిసి డిస్కస్ చేద్దాం అని మంత్రితో అనడంతో అక్కడితో వివాదం ముగిసింది. తాజాగా ఈ వివాదంలోకి వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎంటర్ అయింది.
దీంతో మరోసారి ఇది రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఆర్జీవీపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. పనిపాట లేని వ్యక్తి ఆర్జీవీ అంటూ విరుచుకుపడింది. పైకి ఏం పట్టించుకోనట్లు కనిపించినా… తన గురించి మాట్లాడిన వ్యక్తిపై పగ తీర్చుకునే టైపు ఆర్జీవీ అంటూ ఫైర్ అయింది. ఏ రోజైనా తన గురించి వార్త రానప్పుడు.. ఏదో ఒక సంచలన క్రియేట్ చేస్తుంటాడని విమర్శించింది. నీకు అంతకుముందు నేను దొరికాను, సురేష్ బాబు పంచన చేరావు. ఈరోజు నీకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కావాల్సి వచ్చాయా అని సూటిగా ప్రశ్నించింది. ఎందులో అయిన దూరిపోయి సర్వనాశనం చేసే వ్యక్తి ఆర్జీవీ అని అంది. బాలీవుడ్ ‘ ఛీ తూ..’ అంటే తట్టాబుట్టా సర్దుకుని.. హైదరాబాద్ వచ్చేశావు. బ్లూ ఫిలిమ్స్ తీయడం, బీగ్రేడ్, సీగ్రేడ్ తీయడం, అమ్మాయిలను కూర్చోబెట్టుకుని వాళ్ల తొడల గురించి మాట్లాడటం ఆయన తీరని విమర్శించింది. నువ్వు ఏమైనా చేసుకో.. జగన్ ప్రభుత్వ జోలికి రాకు.. జగన్ గారి జోలికా రావాలంటే ముందుగా నన్ను దాటుకుని వెళ్లాలని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఆర్.జి.వి గురించి శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…