కరోనా కిట్ లో లిక్కర్ బాటిల్స్ పంచిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ !

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కరోనా కరోనా మెడికల్ కిట్లు పంపిణీ చేసారు. అయితే కేవలం మెడిసిన్ మాత్రమె పంచితే ప్రత్యేకత ఏముంది అనుకున్నారో ఏమో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సారు. ప్రతి కిట్లో మెడిసిన్ తో పాటూ లిక్కర్ సీసాలు కూడా పెట్టి పంచేశారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్​ నియోజకవర్గంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బానోత్ ​శంకర్​నాయక్​ గురువారం ఎమ్మెల్సీ తరఫున కరోనా మెడికల్​కిట్టును ప్రజాప్రతినిధులకు పంపిణీ చేశారు.

జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మరియు మున్సిపల్​ కౌన్సిలర్లు తదితరులందరికీ ఈ మెడికల్ కిట్లను అందజేశారు. అయితే వీరిలో కొందరు కిట్టును పరిశీలించగా అందులో టీచర్స్​ లిక్కర్​ బాటిల్​ కనపడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎమ్మెల్సీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇలా లిక్కర్ బాటిల్స్ పంపడం అనేది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఎంపీటీసీల ఫోరం లీడర్​వాసుదేవురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.