దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన ఆంక్షలను విధిస్తూ కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో ఎలాంటి శుభకార్యాలకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం పెళ్లి, చావు వంటి వేడుకలకు కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ఎన్నో జంటలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వివాహాలు జరిపించారు. ఈ క్రమంలోనే ఓ జంట ఏకంగా కోవిడ్ కేర్ సెంటర్ నే వివాహ వేదికగా చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండలేరు.
ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపును ప్రకటించింది. ఈ క్రమంలోనే వివాహ వేడుకలకు విధించిన ఆంక్షలను కూడా సడలించారు.దీంతో పార్నర్ పట్టణానికి చెందిన రెండు జంటలు కోవిడ్ సెంటర్లో వివాహం చేసుకొని ఒక్కటైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతో పెద్ద చదువులు చదివిన ఈ జంటలుఎంతో ఘనంగా తమ పెళ్లిని చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి తమ పెళ్లి ఖర్చులన్నీ పూర్తిగా తగ్గిస్తూ ఎంతో నిరాడంబరంగా కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకుని, పెళ్లికి అయ్యే ఖర్చునంతటిని ఆ కోవిడ్ కేర్ సెంటర్ కు విరాళంగా ప్రకటించారు.స్థానిక ఎమ్మెల్యే నీలేష్ లంకకు చెందిన శరద్ చంద్రజీ పవార్ ఆరోగ మందిర్ కోవిడ్ సెంటర్లో ఈ జంట వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్ లో అనికేత్ వ్యవహరే, ఆర్తి షిండే…రాజశ్రీ కాలే, జనార్దన్ అనే రెండు జంటలు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి ఖర్చులు తగ్గించడం వల్ల ఆ డబ్బులతో మాస్కులు, శానిటైజర్ లు, పీపీఈ కిట్లు మందులు కొనుగోలు చేసి ఇవ్వడమే కాకుండా .37000 ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ క్రమంలోనే ఈ జంటలు మాట్లాడుతూ తాము అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కరోనా బాధితులకు ఎంతో ధైర్యం కలుగుతుందని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కొంతవరకు తమ వంతు సాయం ప్రకటించినట్లు అవుతుందని ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.ఈ విధంగా ఈ యువకులు కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకోవడం వల్ల ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్ల చేత ప్రశంశలు అందుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…