దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన ఆంక్షలను విధిస్తూ కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో ఎలాంటి శుభకార్యాలకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం పెళ్లి, చావు వంటి వేడుకలకు కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే జరగాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే ఎన్నో జంటలు లాక్ డౌన్ సమయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వివాహాలు జరిపించారు. ఈ క్రమంలోనే ఓ జంట ఏకంగా కోవిడ్ కేర్ సెంటర్ నే వివాహ వేదికగా చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు మెచ్చుకోకుండా ఉండలేరు.
ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపును ప్రకటించింది. ఈ క్రమంలోనే వివాహ వేడుకలకు విధించిన ఆంక్షలను కూడా సడలించారు.దీంతో పార్నర్ పట్టణానికి చెందిన రెండు జంటలు కోవిడ్ సెంటర్లో వివాహం చేసుకొని ఒక్కటైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతో పెద్ద చదువులు చదివిన ఈ జంటలుఎంతో ఘనంగా తమ పెళ్లిని చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి తమ పెళ్లి ఖర్చులన్నీ పూర్తిగా తగ్గిస్తూ ఎంతో నిరాడంబరంగా కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకుని, పెళ్లికి అయ్యే ఖర్చునంతటిని ఆ కోవిడ్ కేర్ సెంటర్ కు విరాళంగా ప్రకటించారు.స్థానిక ఎమ్మెల్యే నీలేష్ లంకకు చెందిన శరద్ చంద్రజీ పవార్ ఆరోగ మందిర్ కోవిడ్ సెంటర్లో ఈ జంట వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా కోవిడ్ కేర్ సెంటర్ లో అనికేత్ వ్యవహరే, ఆర్తి షిండే…రాజశ్రీ కాలే, జనార్దన్ అనే రెండు జంటలు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి ఖర్చులు తగ్గించడం వల్ల ఆ డబ్బులతో మాస్కులు, శానిటైజర్ లు, పీపీఈ కిట్లు మందులు కొనుగోలు చేసి ఇవ్వడమే కాకుండా .37000 ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ క్రమంలోనే ఈ జంటలు మాట్లాడుతూ తాము అక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కరోనా బాధితులకు ఎంతో ధైర్యం కలుగుతుందని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కొంతవరకు తమ వంతు సాయం ప్రకటించినట్లు అవుతుందని ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.ఈ విధంగా ఈ యువకులు కోవిడ్ కేర్ సెంటర్ లో పెళ్లి చేసుకోవడం వల్ల ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్ల చేత ప్రశంశలు అందుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…