సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల లేదా ఎప్పుడు పడితే అప్పుడు అడ్డూ అదుపు లేకుండా భోజనం చేయటం వల్ల విపరీతమైన శరీర బరువు పెరుగుతారని తెలియజేస్తుంటారు. ఈ విధంగా అడ్డూ అదుపు లేకుండా ఏది పడితే ఆహారం తినడం వల్ల అధిక శరీర బరువు పెరిగి ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.
ఈ విధంగా అధిక శరీర బరువు పెరగడానికి గల కారణం రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల శరీర బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తుంటారు. నిజంగానే రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం వల్ల శరీర బరువు పెరుగుతారా? లేదా అనే విషయాలపై పరిశోధకులు ఎన్నో అధ్యయనాలు జరిపి అసలు విషయం తెలిపారు.
రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేసే పిల్లల్లో అధిక బరువు ఊబకాయం సమస్యలు తలెత్తుతాయా అనే విషయాలు తెలుసుకోవడం కోసం యూకేలోని నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే రోలింగ్ ప్రోగ్రాం నుంచి సేకరించారు. ఈ అధ్యయన ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించారు. ఈ పరిశోధనల ఆధారంగా అర్థరాత్రి లేదా రాత్రి ఎనిమిది దాటిన తరువాత భోజనం చేయడానికి, శరీర బరువు పెరగడానికి ఏమాత్రం సంబంధం లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు.
రాత్రి సమయాలలో ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి శరీర బరువు పెరగరు కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని నిపుణులు తెలియజేశారు. రాత్రి సమయాలలో ఎక్కువగా తీపి పదార్థాలను తీసుకోవడం, అదేవిధంగా ఉప్పు అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక కేలరీలు అందుతాయి.ఈ విధంగా అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను రాత్రి సమయాలలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీర బరువు పెరగడంతో ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు తెలియజేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…