Categories: FeaturedGeneral News

రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే ఏం జరుగుతుంది..?

సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల లేదా ఎప్పుడు పడితే అప్పుడు అడ్డూ అదుపు లేకుండా భోజనం చేయటం వల్ల విపరీతమైన శరీర బరువు పెరుగుతారని తెలియజేస్తుంటారు. ఈ విధంగా అడ్డూ అదుపు లేకుండా ఏది పడితే ఆహారం తినడం వల్ల అధిక శరీర బరువు పెరిగి ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.

ఈ విధంగా అధిక శరీర బరువు పెరగడానికి గల కారణం రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల శరీర బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తుంటారు. నిజంగానే రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం వల్ల శరీర బరువు పెరుగుతారా? లేదా అనే విషయాలపై పరిశోధకులు ఎన్నో అధ్యయనాలు జరిపి అసలు విషయం తెలిపారు.

రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేసే పిల్లల్లో అధిక బరువు ఊబకాయం సమస్యలు తలెత్తుతాయా అనే విషయాలు తెలుసుకోవడం కోసం యూకేలోని నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే రోలింగ్ ప్రోగ్రాం నుంచి సేకరించారు. ఈ అధ్యయన ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించారు. ఈ పరిశోధనల ఆధారంగా అర్థరాత్రి లేదా రాత్రి ఎనిమిది దాటిన తరువాత భోజనం చేయడానికి, శరీర బరువు పెరగడానికి ఏమాత్రం సంబంధం లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు.

రాత్రి సమయాలలో ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి శరీర బరువు పెరగరు కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల అధిక శరీర బరువు పెరుగుతారని నిపుణులు తెలియజేశారు. రాత్రి సమయాలలో ఎక్కువగా తీపి పదార్థాలను తీసుకోవడం, అదేవిధంగా ఉప్పు అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక కేలరీలు అందుతాయి.ఈ విధంగా అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను రాత్రి సమయాలలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీర బరువు పెరగడంతో ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago