CPI Narayana : రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ లో చేరుతారో తెలియదు, ఏ పార్టీ మరో పార్టీ తో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో విజయం కోసమే అన్నట్లుగా అన్ని పార్టీలు ఎవరికి వారు వ్యూహ రచనకు పదును పెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో అయితే బీజేపీ ప్రాపకం కోసం అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండూ పాకులాడుతున్నాయి. ఎవరు గెలిచినా బీజేపీకి ఢోకా లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోందో అనే విషయాలను సిపిఐ సీనియర్ నేత నారాయణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
పవన్ సీఎం అయితే…
సిపిఐ నారాయణ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యణ్ తో పొత్తు గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఈ ఎన్నికలలో పవన్ కళ్యణ్ సీఎం కాలేడని అందుకు అనుకూల పరిస్థితులు ఆయనకు లేవని తెలిపారు. ఆ విషయం ఆయనకే తెలుసు అందుకే ఒక ముప్పై సీట్లైనా వస్తే అన్నట్లుగా ఉన్నారని తెలిపారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు గురించి మాట్లాడుతూ వాళ్లిద్దరూ జతకడితే బాగుంటుందని బీజేపీ ని కలుపుకోక పోతే మేము వాళ్ళతో కలిసి నడుస్తామని చెప్పారు. జనసేన టీపీడీ బీపీజీ కలిస్తే జగన్ కి మరోసారి గెలుపు నల్లేరు మీద నడకే అంటూ చెప్పారు.
వీరిద్దరికీ పడే మైనారిటీ బీసీ ఓట్లు జగన్ కు పడుతాయన్ని చెప్పారు. అందుకే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది కానీ బీజేపీ ని కలుపుకోక పోతేనే మంచిదని చెప్పారు. ఇక ఒకవేళ బీజేపీతో ఆ రెండు పార్టీలు కలిస్తే వామపక్షాలు ఆ కూటమికి దూరంగా ఉంటాయని చెప్పారు. టీడీపీ, జనసేన ఒకవేళ పొత్తు కోసం వామపక్షాలను అడిగినా బీజేపీ లేకుంటే వస్తామని కండిషన్ పెడతామని అలా కాకుండా బీజేపీ ఉన్నా జగన్ ను ఓడించడం కోసం చేతులు కలిపమంటే అది వామపక్షాలు చచ్చిపోయినట్లే, బీజేపీ తో కలిసి పనిచేయాల్సి వస్తే అంతకన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని భావిస్తాం అంటూ చెప్పారు. బీజేపీ అసలు మానవత్వ పార్టీనే కాదని కులతత్వాన్ని రెచ్చగొడుతుందని చెప్పారు. చంద్రబాబు సరైన సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారని చెబుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ బీజేపీ తో చేతులు కలిపితే రాష్ట్రానికి అన్యాయం చేసినవాడవుతాడు. అదే బీజేపీ కి దూరంగా ఉంటే ఏపీ లో అధికారం వస్తుంది ఏపీ ప్రజలను కాపాడినవాడు అవుతాడు అంటూ నారాయణ అభిప్రాయపడ్డారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…