సాధారణంగా ఒక వ్యక్తి ఎంతో భావోద్వేగానికి గురి అవుతున్నాడు అంటే అతనికి కంటిలో నుంచి నీరు కారుతాయి. అయితే మనిషి కళ్ళలోంచి కన్నీళ్ళు కారుతున్నాయి అంటే అది కేవలం భావోద్వేగమైన ఏడుపు మాత్రమే కాకుండా.. మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా మన కంటినుంచి ఈ విధంగా కన్నీరు కారుతుంటాయి. అయితే నవ్వడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ఏడవడం, మన కంటిలో నుంచి నీరు బయటకు రావడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఏడవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా మనం ఏదైనా బాధ కలిగినప్పుడు పదేపదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాము. ఈ విధంగా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదల అవుతాయి. ఇలా రసాయనాలు విడుదలైనప్పుడు మనలో శారీరక మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు జరుగుతాయి.
మనం బాగా ఏడవడం వల్ల మన మెదడులో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉండిపోతాయి. ఈ విధంగా మెదడు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల మనం ఏ విషయం అయినా ఎంతో సమన్వయంతో ఆలోచించగలగతాము. ఈ విధంగా అప్పుడప్పుడు ఏడవటం వల్ల కళ్ల నుంచి నీరు బయటకు కారి మన శరీరంలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ క్రమంలోనే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.
సాధారణంగా మన కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయి. 1 బాసిల్ టియర్స్: ఈ కన్నీళ్ళు నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రో లీటర్లు ఉత్పత్తి అవుతాయి. ఈ కన్నీళ్లు మన కంటిని ఎల్లప్పుడూ తేమగా ఉంచడమే కాకుండా కంటికి వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
రిఫ్లెక్స్ టియర్స్: ఇలాంటి కన్నీళ్లు మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు వస్తాయి.అదేవిధంగా కళ్లల్లో దుమ్ము ధూళి పడినప్పుడు కళ్ళు మంటను తగ్గించడానికి ఈ విధమైనటువంటి కన్నీళ్లు వస్తాయి.
ఎమోషనల్ టియర్స్: ఈ విధమైనటువంటి కన్నీళ్లు మనం ఎంతో భావోద్వేగానికి గురైనప్పుడు కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. ఈ విధమైనటువంటి కన్నీళ్లు రావడం వల్ల ఇవి మానసిక బాధలను తగ్గిస్తాయి. కనుక నవ్వడమే కాకుండా అప్పుడప్పుడు ఏడవడం వల్ల కూడా మనం ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…