రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంతో మంది అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షలకు లక్షలు డబ్బును దోచుకుంటున్నారు.ఇప్పటివరకు ఈ విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎందరినో చూసాము. చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతూ లక్షలకు లక్షలు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.6.5 లక్షలు దోచుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
నగరంలోని లోతుకుంటకు చెందిన పశుపతి అనే వ్యక్తి ఆన్ లైన్ ద్వారా ఆయుర్వేద ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్రొడక్ట్స్ అతనికి డెలివరీ అయ్యాయి. అయితే ఆ ఉత్పత్తులు తనకు నచ్చకపోవడంతో తిరిగి వాటిని రిటన్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు.
ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తికి ఫోన్ వచ్చింది. అవతలి నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ… మీ డబ్బులు వాపసు ఇస్తానని చెప్పాడు. అందుకోసం ఒక లింక్ మీ మొబైల్ కి పంపిస్తాను దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పిన విధంగానే పశుపతి ఎనీ డెస్క్ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నాడు.ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మరోసారి ఆ వ్యక్తి ఫోన్ చేసి పశుపతి క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లు తీసుకొని త్వరలోనే మీ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పారు.
ఈ విధంగా అవతలి వ్యక్తి ఫోన్ మాట్లాడి పెట్టేసిన కొన్ని నిమిషాలకే పశుపతి 2 ఖాతాల నుంచి ఏకంగా రూ.6.5లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో వెంటనే అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు.అప్పటికే అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన పశుపతి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…