రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంతో మంది అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షలకు లక్షలు డబ్బును దోచుకుంటున్నారు.ఇప్పటివరకు ఈ విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఎందరినో చూసాము. చాలామంది ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతూ లక్షలకు లక్షలు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.6.5 లక్షలు దోచుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
నగరంలోని లోతుకుంటకు చెందిన పశుపతి అనే వ్యక్తి ఆన్ లైన్ ద్వారా ఆయుర్వేద ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్రొడక్ట్స్ అతనికి డెలివరీ అయ్యాయి. అయితే ఆ ఉత్పత్తులు తనకు నచ్చకపోవడంతో తిరిగి వాటిని రిటన్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు.
ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తికి ఫోన్ వచ్చింది. అవతలి నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ… మీ డబ్బులు వాపసు ఇస్తానని చెప్పాడు. అందుకోసం ఒక లింక్ మీ మొబైల్ కి పంపిస్తాను దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. సదరు వ్యక్తి చెప్పిన విధంగానే పశుపతి ఎనీ డెస్క్ ఆప్ డౌన్లోడ్ చేసుకున్నాడు.ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మరోసారి ఆ వ్యక్తి ఫోన్ చేసి పశుపతి క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లు తీసుకొని త్వరలోనే మీ డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని చెప్పారు.
ఈ విధంగా అవతలి వ్యక్తి ఫోన్ మాట్లాడి పెట్టేసిన కొన్ని నిమిషాలకే పశుపతి 2 ఖాతాల నుంచి ఏకంగా రూ.6.5లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో వెంటనే అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు.అప్పటికే అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన పశుపతి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…