Dasara: నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని థియేటర్ల వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక వసూలు రాబట్టిన ఈ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది.
ఈ సినిమా విడుదలై ఇప్పటికే 15 రోజులు గడిచినప్పటికీ ఈ సినిమా హవా మాత్రం తగ్గటం లేదు ఇప్పటికి థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తూ వసూళ్లు సాధిస్తుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఈ సినిమా లో నాని అద్భుతమైన నటనకు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఇక మహానటి సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తీ సురేష్ ఈ సినిమాలో డీ – గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం ప్రతిభ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే తన సత్తా నిరూపించుకున్నాడు. ఇంతకాలం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులలో అలరించడానికి సిద్ధమయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మే 30 నుండి దసరా సినిమా ఓటీటీ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 30 వ తేది నుండి దసరా సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో ప్రేక్షకులను సందడి చేసిన దసరా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆధారపడి పొందుతుందో తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…