ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఉధృతి క్రమంగా తగ్గుతున్న క్రమంలో ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ క్రమంలోనే ఈ మహమ్మారి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో మరోసారి పంజా విసరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మనదేశంలో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో నష్టాన్ని కలిగించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వేరియంట్ మరికొత్త రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్ గా పంజా విసురుతుంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు అధికంగా నమోదయ్యాయి. అదేవిధంగా 2 మరణాలు కూడా సంభవించినట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులో పలు రాష్ట్రాలలో నమోదు కావడం వల్ల కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలను సూచించింది. ప్రస్తుతం మన దేశంలో వ్యాప్తి చెందుతున్న టువంటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మరో తొమ్మిది దేశాలలో కూడా వ్యాపించి ఉందని ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మూడు ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం, ఊపిరితిత్తుల కణాలకు నేరుగా అంటుకుపోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగకపోవడం.. వంటి లక్షణాలు ఈ వైరస్లో ఉన్నాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ సమర్థవంతంగా తీసుకున్నప్పటికీ డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకసారి కరోనా బారినపడిన వారిలో నేనూ, అదేవిధంగా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
మనదేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో థర్డ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందుకోసమే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి తగినన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అధికారులు తెలియజేస్తున్నారు. రెండవ దశ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…