Dhee show Harinath Reddy Master : తెలుగు బుల్లితెర మీద డాన్స్ షోస్ లో నెంబర్ వన్ అంటే ఢీ షో గుర్తొస్తుంది. ఇప్పటికీ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ షో మొదటి సీజన్ అయితే ఫుల్ హైప్ తో టాప్ రేటింగ్స్ తో దుసుకుపోయింది. ఈ మధ్య ఢీ షోలో కామెడి స్కిట్స్ అంటూ పెట్టి రేటింగ్స్ కోసం కష్టపడుతున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఈ షోకి మంచి రేటింగ్స్ ఉండేవి. సీజన్ వన్ అయితే ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్. ఇక ఆ సీజన్ లో విన్నర్ గా నిలిచిన హరినాథ్ రెడ్డి గారిని ఎవరూ మర్చిపోలేరు. అయితే ఢీ పలు సీజన్స్ లో పాల్గొన్న ఆయన మళ్ళీ మీడియాకు కనిపించలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కనిపించిన ఆయన ఢీ షో అలాగే మరికొన్ని డాన్స్ షోల గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ఢీ లో జరిగిన అవమానాలు…
ఢీ మొదటి సీజన్ లో విన్నర్ గా నిలిచిన హరినాథ్ రెడ్డి ఢీ షో గురించి మాట్లాడుతూ మొదటి సీజన్ తరువాత సినిమాల్లో డాన్స్ మాస్టర్ గా అవకాశాలు వచ్చినా కోరియోగ్రాఫర్ గా కార్డు తీసుకోవాలని తెలియక పోవడం వల్ల ఆఫర్స్ కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ఢీ మొదటి సీజన్ అయ్యాక రెండో సీజన్ అపుడు చేస్తానని చెబితే వద్దని వెంటనే మళ్ళీ వస్తే జనాలు బోర్ ఫీల్ అవుతారు అంటూ చెప్పారు. ఆర్థిక అవసరాల కోసం అడిగాను అయితే సీజన్ మధ్యలో కాల్ చేసి రమ్మని పిలిచారు. వెళ్ళాక ఆల్రెడీ ఉన్న మాస్టర్లు నన్ను అంగీకరించలేదు.
నన్ను కంటెస్టెంట్ గానే తీసుకున్నారు. ఆ సమయంలో చాలా అవమానించారు. నేనుండకూడదని చాలా పట్టుబట్టడంతో నన్ను ఎలిమినేట్ చేసారు. ఇక మళ్ళీ ఢీ సిక్స్ సీజన్ లో కూడా నన్ను పిలిచారు. అపుడు మాస్టర్ గా పిలిచినా మధ్యలోనే పాలిటిక్స్ జరిగి ఎలిమినేట్ చేసారు. షో మేనేజ్ మెంట్ కి ఎలాంటి పాలిటిక్స్ తెలియవు. మధ్యలో ఉండే వాళ్ళే ఇవన్నీ చేస్తారు అంటూ పైగా నన్ను ఎలిమినేట్ చేస్తున్నట్లు ఒక ఎపిసోడ్ ఉండదు వెళ్ళిపోమన్నారు. ఇలా ఎన్నో జరిగాక ఢీ షో చేయకూడదని అనుకున్నాను అంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నట్లు తెలిపారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…