KGF Director: కేజిఎఫ్ డైరెక్టర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి సమీప బంధువని మీకు తెలుసా?
KGF Director: కేజిఎఫ్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమనే కాకుండా యావత్ చలన చిత్ర పరిశ్రమను తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేజిఎఫ్ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కేజిఎఫ్ 2తో మరింత గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు.ఇలా ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిరలోని నీలకంఠపురం గ్రామానికి చెందినవారు. అంతేకాదండోయ్ ప్రశాంత్ నీల్ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి సమీప బంధువు కూడా. ఇంతకీ రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ వరుసకు ఏమి అవుతారనే విషయానికి వస్తే..
ప్రశాంత్ తండ్రి నీలకంఠాపురం సుభాష్ రెడ్డి. ఈయన మాజీ మంత్రి రఘువీరారెడ్డి తండ్రికి తమ్ముడి వరస అవుతారు. ఈ విధంగా చూసుకుంటే రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. ప్రశాంత్ నీల్ తండ్రి కర్ణాటకకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడంతో వీరి కుటుంబం మొత్తం కర్ణాటకలోనే సెటిల్ అయ్యారు అంతే కానీ ప్రశాంత్ నీల్ నిజానికి తెలుగువారని తెలియడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…