ఆ జంటను చూశారా.. వాళ్లు ఒకటయ్యారు.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..?

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు అంటారు. తన భాగస్వామి ఎవరు అవుతారనేది చాలామంది ఊహించలేరు. సంబంధం కుదిరిన తర్వాతనే వాళ్ల గురించి తెలుకుంటారు. అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న జంటను చూశారా.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అయ్యారు. అదేంటి.. మైనర్లకు పెళ్లి చేయకూడదు కదా.. వాళ్లిద్దరని చూస్తుంటే ఇంకా 10 సంవత్సరాలు కూడాదాటలేదు.. అప్పుడే పెళ్లి చేశారేంటి అనే అనుమానం కచ్చితంగా వస్తుంది.

అక్కడికే వస్తున్నా.. విషయం ఏటంటే.. వాళ్లిద్దరు మైనర్లు కాదు.. ఇద్దరూ మేజర్లే. ఇద్దరికీ కూడా 25 ఏళ్లకు పైగానే వయస్సు ఉంది. అందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు విష్ణు, ఆమె పేరు జ్యోతి. అతడికి 28 ఏళ్లు, ఆమెకు 26 ఏళ్లు. అతడు బెంగుళూరు వాసి.. ఆమె కోలారుకు చెందిన యువతి.

వారిద్దరూ కూడా బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే జీన్స్ సమస్యల కారణంగా వాళ్ల శరీరం పెరగకుండా అలా మందగించింది. అందుకే మనకు వాళ్లు అలా కనిపిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఏ నాడు వాళ్లు పొట్టిగా ఉన్నారని బాధపడలేదట.. ఎగతాళి చేస్తున్నా.. పట్టించుకునే వారు కాదట.. వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గకుండా ఇలా ముందుకు సాగారు.

ఇద్దరూ కూడా ఒకరినొకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చింతామణి దగ్గరున్న కైవార క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీళ్ల పెళ్లిక సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. నిజంగా వారి ఆత్మ విశ్వాసానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.