మానవ శరీరంలో ప్రతీ ఒక్క అవయవం ఆరోగ్యకరంగా ఉంటేనే మానవుడు బతుకుతాడు. లేదంటే.. చావు అంచుల్లోకి వెళ్లాల్సిందే. తర్వాత ఆసుపత్రుల వెంట తిరిగినా ఉపయోగం లేకుండా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంటుందన్న విషయం తెలిసిందే.
అయితే దానిని అనారోగ్యానికి గురి కాకుండా మనం ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. అందులో ముఖ్యంగా బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే.. ఆయుర్వేదంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు బెల్లం ఎక్కువగా వినియోగిస్తారు.
ఇది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. రెండోది చేప. చేపలు ప్రతీ ఒక్కరూ తినొచ్చు. దీనిలో ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ఆపిల్ పండు తీసుకోవడం కూడా చాలామంచిది. ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు చేసే పని సామార్థ్యం అధికంగా పెరుగుతుంది.
ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరో పండు బీట్ రూట్. ఇది ఎక్కువగా రక్తం పెరగడానికి.. రక్తహీనత అధికంగా ఉండే వారు తీసుకుంటారు. వాటితో పాటు వీటిని తీసుకుంటే.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక చివరకు భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే వెల్లులి. దీనిలో అల్లిసిన్ ఉంటుంది. దీని వల్ల ఉబ్బసం, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…