మానవ శరీరంలో ప్రతీ ఒక్క అవయవం ఆరోగ్యకరంగా ఉంటేనే మానవుడు బతుకుతాడు. లేదంటే.. చావు అంచుల్లోకి వెళ్లాల్సిందే. తర్వాత ఆసుపత్రుల వెంట తిరిగినా ఉపయోగం లేకుండా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంటుందన్న విషయం తెలిసిందే.
అయితే దానిని అనారోగ్యానికి గురి కాకుండా మనం ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. అందులో ముఖ్యంగా బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే.. ఆయుర్వేదంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు బెల్లం ఎక్కువగా వినియోగిస్తారు.
ఇది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. రెండోది చేప. చేపలు ప్రతీ ఒక్కరూ తినొచ్చు. దీనిలో ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ఆపిల్ పండు తీసుకోవడం కూడా చాలామంచిది. ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు చేసే పని సామార్థ్యం అధికంగా పెరుగుతుంది.
ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరో పండు బీట్ రూట్. ఇది ఎక్కువగా రక్తం పెరగడానికి.. రక్తహీనత అధికంగా ఉండే వారు తీసుకుంటారు. వాటితో పాటు వీటిని తీసుకుంటే.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక చివరకు భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే వెల్లులి. దీనిలో అల్లిసిన్ ఉంటుంది. దీని వల్ల ఉబ్బసం, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…