Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్...?
Sapthagiri: కమెడియన్ సప్తగిరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రం ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన సప్తగిరి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా సప్తగిరి థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతూ డైరెక్టర్ మారుతి చేతికి చిక్కాడు. ఈ క్రమంలో మారుతి సప్తగిరికి చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది.
సప్తగిరి నిజంగా థియేటర్ వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడని నమ్మితే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టే. అవునండి ఇదంతా కేవలం సినిమా టికెట్ల రేట్ల గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వటానికి ఈ విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్క కమర్షియల్ సినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా టికెట్ల రేటు గురించి ప్రేక్షకులలో సందేహాలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ వీడియో ద్వారా టికెట్ రేట్స్ పై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో కమెడియన్ సప్తగిరి థియేటర్ వద్ద 150 రూపాయలకు బ్లాక్ టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో సినిమా టికెట్లు బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావు అని మారుతి అడగ్గా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవిగారి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.
బ్లాక్ లో ఒక టికెట్ ఎంతకీ అమ్ముతున్నావు అని మారుతి అడగ్గా..150 అని సప్తగిరి చెప్పాడు. అదేంటంటే కౌంటర్లో కూడా 150 కే టికెట్ ఇస్తున్నారు కదా. సినిమా ప్రమోషన్స్ లో కూడా బన్నీ వాసు గారు క్లియర్ గా చెప్పారు కదా పాత రేట్లకే ఈ సినిమా టికెట్ రేట్లు ప్రేక్షకులకి అందుబాటులో ఉంటాయని… నువ్వు వినలేదా అని అన్నాడు. నిజంగా పాత రేట్లకు ఈ సినిమా చూడచ్చా సార్ అని సప్తగిరి అంటాడు. ఈ “పక్కా కమర్షియల్” సినిమా టికెట్లను నాన్ కమర్షియల్ రేట్లకే ప్రేక్షకులకు అందజేస్తున్నాం అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…